Varsha Raut: భూ కుంభకోణం కేసు.. సంజయ్ రౌత్ భార్యకు ఈడీ నోటీసులు
ముంబయి: పాత్రా చాల్ భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఇటీవల శివసేన(Shivsena) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut)ను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED).. ప్రస్తుతం ఆయన్ను విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన భార్య వర్షా రౌత్(Varsha Raut)కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆమె పేరును పలుమార్లు ప్రస్తావించిన ఈడీ.. నాలుగు నెలల క్రితం ఆమెకు సంబంధించిన కొన్ని ఆస్తులనూ అటాచ్ చేసింది. కానీ.. ఇప్పటివరకు ప్రశ్నించలేదు. అయితే, విచారణకు ఎప్పుడు హాజరు కావాలనేదానిపై వివరాలు తెలియరాలేదు.
సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ పొడగింపు..
ఇదిలా ఉండగా.. సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఆగస్టు 4 వరకు ఆయనను కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. నేటితో గడువు ముగియనుండటంతో.. ఈడీ ఆయన్ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నందున.. వాటిపై విచారించాల్సి ఉందని, ఆగస్టు 10 వరకు కస్టడీ పొడగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు.. ఆగస్టు 8 వరకు అనుమతించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే రౌత్ భార్యకు సమన్లు జారీ కావడం గమనార్హం.
‘వెంటిలేషన్ లేని గదిలో ఉంచారు..’
కస్టడీ సమయంలో ఈడీ అధికారులు తనను కిటికీలు, వెంటిలేషన్ లేని గదిలో ఉంచారని సంజయ్ రౌత్ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈడీపై ఏదైనా ఫిర్యాదు ఉందా అని విచారణ సందర్భంగా కోర్టు అడిగినప్పుడు.. ఆయన ఈ మేరకు స్పందించారు. ‘ప్రత్యేకంగా ఏం లేదు. కానీ.. తనను ఉంచిన గదికి కిటికీ, వెంటిలేషన్ లేదు’ అని చెప్పారు. దీంతో కోర్టు.. ఈడీ వివరణ కోరింది. రౌత్ను ఏసీ గదిలో ఉంచారని, అందుకే కిటికీ లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితేన్ చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏసీ వినియోగించుకోలేనని రౌత్ తెలిపారు. దీంతో ఆయన్ను సరైన వెంటిలేషన్ ఉన్న గదిలో ఉంచుతామని ఈడీ.. కోర్టుకు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
-
Ts-top-news News
TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- మరో బాదుడు
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
- Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్