Yediyurappa: యడియూరప్పకు సుప్రీంలో ఊరట.. ఫిర్యాదుదారుకు నోటీసులు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు అవినీతికి కేసులో ఊరట లభించింది. ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.........

Published : 23 Sep 2022 18:21 IST

దిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు (B S Yediyurappa) అవినీతికి కేసులో ఊరట లభించింది. ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం స్టే విధించింది. ప్రైవేటు ఫిర్యాదుదారు అభ్యర్థన మేరకు విచారణ జరపాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ యడియూరప్ప ఉన్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణపై తాజాగా స్టే విధించింది. యడియూరప్ప అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది.

యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యడియూరప్ప కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్​మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును ఓ కంపెనీకి ఇచ్చారని ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్​ వేశారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్‌ను నిందితులుగా పేర్కొన్నారు. అయితే,ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మొదట అబ్రహం పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పునఃపరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించగా.. స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని