Omicron : 200 మంది కొవిడ్ బాధితుల్లో ఒక్కరికేఆక్సిజన్ అవసరం..!
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ 20కి పైగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఈ కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. దీని ప్రభావంతో రెండోరోజు 30 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి.
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. దీని ప్రభావంతో రెండోరోజూ 30 వేలకు పైగా కొత్త కొవిడ్ కేసులొచ్చాయి. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నా.. కొవిడ్ బాధితుల్లో ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తుండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా అసోషియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్పీఐ)కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రతి 200 మంది బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వస్తోందని పేర్కొంది. ఈ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2,500 సూపర్ స్పెషాలిటీ, 8వేల చిన్నస్థాయి ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు విషయాలు వెల్లడించింది.
‘కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 0.5 శాతం కంటే తక్కువమందికే ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అంటే ప్రతి 200 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ అవసరం ఉంటోంది. కరోనా రెండో వేవ్ సమయంలో కంటే భిన్నమైన పరిస్థితి ఇది. కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినా.. సగటున మూడు రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ వాటానే ఎక్కువగా ఉంటోంది. అయినా సరే, అక్కడి ఆసుపత్రుల్లో పడకల లభ్యత 90 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని ఏహెచ్పీఐ వెల్లడించింది. ‘మహారాష్ట్రలో దాదాపు 9 నుంచి 10 శాతం పడకలు మాత్రమే నిండుతుండగా, దిల్లీలో 10 శాతం లోపే ఉంది’ అని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జె.జ్ఞాని తెలిపారు.
రెండో దశలో దేశంలో మహమ్మారి భారీగా విజృంభించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ కోరత, ఆస్పత్రుల్లో పడకలు లభించక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వైద్య వ్యవస్థ గతంలో ఎన్నడూ చూడని ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాజా పరిస్థితిపై ఏహెచ్పీఐ వివరాలు సేకరిస్తోంది. కొన్ని మెజారిటీ ఆస్పత్రులు సొంత ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. ‘ఇప్పటివరకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 0.5 శాతం మాత్రమే. ఇది 5 శాతానికి మించినప్పుడు, పడకల ఆక్యుపెన్సీ 30 శాతం దాటినప్పుడు మేం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాం’ అని పేర్కొంది.
ఇతర రకాల కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే..
కరోనాలో ఇతర రకాలతో పోలిస్తే కొత్తదైన ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని, ఆసుపత్రిలో చేరాల్సి వస్తున్నవారి సంఖ్యా స్వల్పమేనని దక్షిణాఫ్రికాలో ఒక అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని నిపుణులు ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వచ్చిన తొలి నాలుగు వారాల్లో ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. గౌటెంగ్ ప్రావిన్సులో బీటా, డెల్టా రకాలు మొదటి నాలుగు వారాల్లో చూపిన తీవ్రతను, ఒమిక్రాన్ ఉద్ధృతిని వీరు పోల్చిచూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..