Covid Vaccine: కరోనాపై టీకాలు: కొత్త వేరియంట్లనూ ఎదుర్కొనే రోగ నిరోధక కణాలు
కొవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని సామాన్యులు కూడా వైరస్లు, టీకాలు,
వ్యాక్సిన్లపై సంశయం వద్దు: శాస్త్రవేత్తలు
కేప్ టౌన్: కొవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని సామాన్యులు కూడా వైరస్లు, టీకాలు, రోగ నిరోధక వ్యవస్థ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే వ్యాక్సిన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన, సానుకూల అంశం పెద్దగా జనబాహుళ్యంలోకి వెళ్లలేదని దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డెవాల్డ్ ష్కోమన్, బుర్ట్రామ్ సి ఫీల్డింగ్ తెలిపారు. టీకా సమర్థత గురించి పరిశీలించేటప్పుడు రోగ నిరోధక వ్యవస్థలోని ఒక పార్శ్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ముఖ్యమైన టి-కణాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్లో కొత్తగా వస్తున్న వేరియంట్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తున్నాయని భరోసా ఇచ్చారు. పైగా ఆ రక్షణ దీర్ఘకాలం కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు టి-కణాలను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో ‘టీకా సంశయాన్ని’ దూరం చేయాలని కోరుతున్నారు. వీరు వెల్లడించిన అంశాలివీ..
బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు, పరాన్నజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారి నుంచి రోగనిరోధక వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. ఇది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి.. యాంటీబాడీలకు సంబంధించినది కాగా.. రెండోది టి కణాలతో ముడిపడినది. యాంటీబాడీలు వైరస్లకు అతుక్కొని, వాటిని బంధించేస్తాయి. తద్వారా అవి కణాలకు ఇన్ఫెక్షన్ కలగకుండా చూస్తాయి. టి కణాలు మాత్రం అప్పటికే వైరస్ బారినపడిన కణాలను చంపేస్తాయి. అంతేకాదు.. భవిష్యత్లో అదే వ్యాధికారక జీవి మన శరీరంలోకి ప్రవేశిస్తే గుర్తించి, రీఇన్ఫెక్షన్ కలగకుండా రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తాయి.
11 ఏళ్ల రక్షణ
మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే కరోనా వైరస్లను అడ్డుకోవడంలో టి కణాలు చాలా శక్తిమంతమైన ఆయుధాలని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. 2003లో వణికించిన సార్స్ కరోనా వైరస్కు వ్యతిరేకంగా వెలువడిన టి-కణ రక్షణ ఏకంగా 11 ఏళ్ల పాటు సమర్థంగా కొనసాగినట్లు 2016లో
జరిగిన అధ్యయనం తేల్చింది.
కొత్త వేరియంట్లపైనా..
చాలావరకూ టీకాల్లో సూక్ష్మజీవికి సంబంధించిన ఒక చిన్న భాగం ఉంటుంది. ఇది సహజసిద్ధ ఇన్ఫెక్షన్ను అనుకరిస్తూ రోగ నిరోధక శక్తిని సన్నద్ధం చేస్తుంది. ప్రస్తుత కొవిడ్ టీకాల్లో కరోనా వైరస్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ భాగాలు ఉన్నాయి. స్పైక్ ప్రొటీన్లో వచ్చిన ఉత్పరివర్తనల వల్ల వ్యాధిని వ్యాప్తి చేయడం, రోగనిరోధక స్పందనను ఏమార్చడం వైరస్కు చాలా సులువైంది. అయితే టి కణాలు.. మొదటి వేరియంట్పై పనిచేసిన తరహాలోనే కొత్త రకాలనూ నిర్వీర్యం చేయగలవు. యాంటీబాడీలు తగ్గిపోయినా.. ఇవి దీర్ఘకాలం పాటు పనిచేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..