
Indian Railways: కరోనా కాటుకు 2903 మంది ఉద్యోగులు బలి!
మొత్తం కేసుల్లో 11శాతం మంది 20ఏళ్లలోపు వారే - కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయానికి వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొవిడ్-19 ప్రభావానికి 2,903 మంది రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు వెల్లడించారు. అయితే, ఆ ఉద్యోగులకు చెందాల్సిన బకాయిలను ఇప్పటికే 2,780 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రైల్వే ఉద్యోగులపైన ఆధారపడే కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టే విధానం రైల్వేలో ఉందని.. ఇందులో భాగంగా ఇప్పటికే 1732 కేసుల్లో వీటిని అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
రైల్వే శాఖలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోందని రైల్వేశాఖ వెల్లడించింది. 8,63,868 మంది రైల్వే ఉద్యోగులకు తొలిడోసు పంపిణీ చేయగా.. 2,34,184 మందికి రెండు డోసులు ఇచ్చామని పేర్కొంది.
11శాతం మంది 20 ఏళ్లలోపువారే..
దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 11శాతం 20ఏళ్లలోపు వారిలోనేని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో 18ఏళ్లలోపు పిల్లల్లో ఎంతమందికి వైరస్ సోకిందని లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఇక పిల్లల వ్యాక్సిన్లకు సంబంధించి ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2-18ఏళ్ల పిల్లలపై ప్రయోగాలు జరిపేందుకు భారత్ బయోటెక్కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ-CDSCO అనుమతి ఇవ్వగా.. 12ఏళ్ల వయసుపైబడిన వారి కోసం జైడస్ క్యాడిలా సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు మరో సమాధానంగా చెప్పారు. వీటి ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gargi: సాయి పల్లవి న్యాయపోరాటం.. ‘గార్గి’ ట్రైలర్ వచ్చేసింది!
-
General News
Andhra News: విజయవాడలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు... చెన్నై, విశాఖ ఎలా వెళ్లాలంటే?
-
World News
Boris Johnson: వివాదాల బోరిస్ జాన్సన్.. ‘బ్రిటన్ డొనాల్డ్ ట్రంప్’..!
-
Sports News
IND vs ENG : అలా చేయడం అద్భుతం.. విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కోచ్ ప్రశంసల జల్లు
-
World News
Boris Johnson: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
-
Movies News
Tamannaah: సినీ ప్రియులకు తమన్నా ప్రామిస్.. ఎందుకంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!