viral video: వంతెనపై నుంచి వేలాడుతూ.. కదులుతున్న రైల్లో చోరీ..

నదీ అందాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా.. సినీఫక్కీలో చోరీ చేసిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో దొంగను నెటిజన్లు స్పైడర్‌ మ్యాన్‌తో పోలుస్తున్నారు.

Published : 11 Jun 2022 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  నదీ అందాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా.. సినీఫక్కీలో చోరీ చేసిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో దొంగను నెటిజన్లు స్పైడర్‌ మ్యాన్‌తో పోలుస్తున్నారు. ఈఘటన బిహార్‌లోని బేగుసరై వద్ద గంగానది వంతెనపై చోటు చేసుకొంది. ఈ వీడియోలో రైలు గంగానది వంతెనపైనుంచి ప్రయాణిస్తుండగా.. ఇద్దరు యువకులు కంపార్ట్‌మెంట్‌ మెట్లపై కూర్చొని నదిని తమ మొబైల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారు. అప్పటికే వంతెన పక్కనే ఉన్న ఇనుప దిమ్మెను పట్టుకొని వేలాడుతున్న ఓ వ్యక్తి.. రెప్పపాటులో ముందుకు వంగి కదలుతున్న రైల్లో ఉన్న వారి చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను లాక్కొన్నాడు. ఫొన్‌ పోగొట్టుకొన్న వ్యక్తికి అసలేం జరిగిందో కూడా కాసేపు అర్థం కాలేదు.

ఈ తతంగం మొత్తం రైల్లో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో రికార్డైంది. ఈ వీడియో క్లిప్‌ను స్లోమోషన్‌లో పరిశీలిస్తే గానీ..  ఫోన్‌ చోరీ జరిగినట్లు తెలియదు. బేగుసరై వద్ద రాజేంద్ర సేతుపై పట్నా-కథియార్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌  వెళ్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ దొంగలు రైలు తలుపుల వద్ద కూర్చొన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఇప్పటికే కొంతమంది దొంగలను అరెస్టు చేసినా.. ఇటువంటి ఘటనలు మాత్రం ఆగడంలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని