MGNREGA: బకాయిల వివాదం.. 50లక్షల లెటర్లతో తృణమూల్ సిద్ధం!
జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ 50లక్షల లెటర్లను కేంద్ర మంత్రికి పంపించనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది.
కోల్కతా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) నిధుల విడుదల విషయంలో పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ దేశ రాజధానిలో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 50లక్షల లెటర్లనూ కేంద్ర మంత్రికి పంపించనున్నట్లు తెలిపింది.
‘ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్నప్పటికీ బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని నిశ్చయించాం. ఇప్పటివరకు 50లక్షల లేఖలను సేకరించాం. ప్రధాని మోదీ కార్యాలయంతోపాటు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు వీటిని పంపిస్తాం. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ పోరాడుతుంది’ అని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దిల్లీలోని రాజ్ఘాట్లో నివాళులు అర్పించడంతోపాటు మరుసటి రోజు నగరంలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్!
ఉపాధి హామీ పథకంతోపాటు గ్రామీణ్ ఆవాస్ యోజనకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.15వేల కోట్లను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిలుపుదల చేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో దేశ రాజధానిలో నిరసనలకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు రాలేదని సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖలను పంపిస్తామని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
భారత్లో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించినట్లు ప్రధాని మోదీ దుబాయ్ ‘కాప్-28’ సదస్సులో తనదైన శైలిలో అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి భాజపా ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలతో తూట్లు పొడిచింది. -
ఈ సారి చలి తీవ్రత తక్కువే!
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
ఇదేం పెళ్లిరా బాబూ!
బిహార్లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు. -
హెచ్ఐవీ పాజిటివ్ టీనేజర్లతో కోల్కతాలో దేశంలోనే తొలి కేఫ్
పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలోని సౌత్ కోల్కతాలో 14 మంది టీనేజర్లు ‘కేఫ్ పాజిటివ్’ పేరుతో ఓ కాఫీ షాపు నడుపుతున్నారు. -
రూ.4,950 విద్యుత్తు బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు!
నెలనెలా విద్యుత్తు బిల్లు కట్టేటప్పుడు చెల్లించిన మొత్తానికి సిబ్బంది రసీదు ఇస్తారు. ఒకవేళ చిల్లర లేదని ఎక్కువగా చెల్లిస్తే.. తర్వాతి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. -
కళాశాలల్లో సెల్ఫీ పాయింట్లు
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. -
సోనియా, రాహుల్ ఆదాయపన్ను మదింపు కేసు 13కు వాయిదా: సుప్రీంకోర్టు
తమ ఆదాయపు పన్ను మదింపు వ్యవహారాన్ని సెంట్రల్ సర్కిల్కు బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు; ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. -
10, 12 తరగతుల ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: సీబీఎస్ఈ
పది, పన్నెండు తరగతుల పరీక్షల ఫలితాలకు సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన వెలువరించింది. -
నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్ అధికారి
‘అన్ని ర్యాంకులు, అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం’ అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తెలిపారు. -
వాస్తవాలను మరుగుపరుస్తున్న నకిలీ వార్తలు
నకిలీ వార్తలు వెల్లువలో వాస్తవ సమాచారం మరుగునపడిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
గ్రీన్ క్రెడిట్స్ కార్యక్రమానికి మోదీ శ్రీకారం
బంజరు భూముల్లో మొక్కల పెంపకం ద్వారా గ్రీన్ క్రెడిట్స్ను పొందడంపై దృష్టిసారించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కాప్28లో శ్రీకారం చుట్టారు. -
మొయిత్రా బహిష్కరణపై ఎథిక్స్ కమిటీ సిఫార్సు 4న లోక్సభ ముందుకు
ప్రశ్నలు అడిగినందుకు డబ్బు’ వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సు లోక్సభ ముందుకు రానుంది. -
అటవీ భూముల లీజుకు కొత్త నిబంధనలు
అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. -
బాధితుణ్ని నిందితుడిగా మార్చే కుట్ర
బాధితుడినైన తనపై కల్పిత అభియోగాలు మోపి నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. -
బీఎస్ఎఫ్ పరిధి పెంపు కోసం పంజాబ్ పోలీసుల అధికారాన్ని హరించరాదు
అంతర్జాతీయ సరిహద్దుల వెంట తనిఖీలు, జప్తులు, అరెస్టులకు సంబంధించి బీఎస్ఎఫ్ అధికార పరిధిని 50 కి.మీ. వరకు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ పోలీసుల అధికారాలను హరించేలా ఉండరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
స్టే ఉత్తర్వుల గడువుపై పునఃపరిశీలన
సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, ఆ ఉత్తర్వులకు ఆరు నెలల్లో గడువు తీరిపోతుందని 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. -
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి కోడెక్స్ ఏలిమెంటేరియస్ కమిషన్ (సీఏసీ) ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. -
సంపూర్ణ సురక్షితంగా పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులు
పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులను రానున్న రెండేళ్లలో చొరబాట్లకు వీల్లేని విధంగా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
సిల్క్యారా సొరంగంలో కలిసికట్టుగా కార్మికులు
ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నీటిపైపుల ద్వారా తమ సమాచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న సంతోష్ అనే ఓ కార్మికుడు తెలిపారు. -
అంతర్జాతీయ నేరాలను కలిసికట్టుగా అరికడదాం
అంతర్జాతీయ నేరాలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని భారత్ పిలుపు ఇచ్చింది. -
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
గుజరాత్లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా చనిపోయిన 1052 మందిలో 80శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు.


తాజా వార్తలు (Latest News)
-
70 ఏళ్ల బామ్మకు కవలలు
-
TS News: పాలిటెక్నిక్కు సరికొత్త సిలబస్
-
Nagarjuna Sagar: మధ్యాహ్నం కల్లా కేంద్రం అధీనంలోకి పూర్తిగా సాగర్ ప్రాజెక్టు
-
‘ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా’.. ఎంపీడీవోపై ముత్తంశెట్టి చిందులు
-
Mitchell Marsh: వరల్డ్ కప్పై మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్
-
Hyderabad: కుమార్తెకు సొంత వైద్యం.. ప్రాణం మీదకు తెచ్చిన తండ్రి