Corona: ఉపశమనం కలిగించే ‘పాజిటివ్’ న్యూస్!
దేశాన్ని వణించిన కరోనా సెకండ్వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు సోమవారం నమోదైంది. దిల్లీతో పాటు తెలుగు......
ఇంటర్నెట్ డెస్క్: దేశాన్ని వణించిన కరోనా సెకండ్వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు సోమవారం నమోదైంది. దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుదల నమోదైంది. రేపు ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను కర్ణాటక నడపనుంది. కొవిడ్ వేళ ఊరటనిచ్చే కొన్నివార్తలు మీకోసం..
* కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త వ్యాక్సినేషన్ పాలసీ నేటినుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఒక్కరోజులోనే భారీగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. ఈ సాయంత్రం 6.30గంటల సమయానికి దేశవ్యాప్తంగా 75లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం ఉచితంగా టీకాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
* తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు దిగి వస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 1,19,537 శాంపిల్స్ పరీక్షించగా 1197 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. తాజాగా 9మంది మృతిచెందగా.. 1709మంది కోలుకున్నారు. ప్రస్తుతం 17,246 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇకపోతే ఏపీలో కొత్త కేసులు 3వేల కన్నాతక్కువే నమోదయ్యాయి. 55,002 శాంపిల్స్ పరీక్షించగా.. 2620 మందిలో వైరస్ బయటపడింది. తాజాగా 44మంది మృతిచెందగా.. 7504మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,140 క్రియాశీల కేసులు ఉన్నాయి.
* రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.98 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 29.35 కోట్ల డోసులు రాష్ట్రాలకు సమకూర్చగా.. 26.36 కోట్ల డోసులు పంపిణీ జరిగిందని తెలిపింది. ప్రస్తుతం 2,98,77,936 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
* దేశంలో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు 88 రోజుల కనిష్ఠస్థాయికి చేరాయి. ఆదివారం 13.88 లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 53,256 మందిలో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, మరణాలు కూడా కూడా తగ్గుతున్నాయి. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా కొనసాగుతున్నాయి. యాక్టివ్ కేసుల గ్రాఫ్ కిందకు దిగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.83శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.32%గా కొనసాగుతోంది. భారత్లో రికవరీ రేటు 96.36%గా ఉంది.
* కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తరుణంలో తమ సంస్థ తరఫున 15లక్షల లీటర్లకు పైగా ప్రాణవాయువును దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్టు వేదాంత గ్రూపు వెల్లడించింది. థర్డ్ వేవ్ ముప్పు సంకేతాల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు చర్యలతో సిద్ధంగా ఉన్నట్టు ఆ గ్రూపు సీఈవో సునిల్ దుగ్గల్ ఓ ప్రకటనలో తెలిపారు. వేదాంత కేర్స్ ఇన్సియేటివ్లో భాగంగా తమ కంపెనీ దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో 1410 క్రిటికల్ కేర్ బెడ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, 502 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు 10,500 పీపీఈకిట్లను కూడా సమకూర్చిందన్నారు.
* దిల్లీలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. సోమవారం 57,128 శాంపిల్స్ పరిక్షించగా.. 89మందికి మాత్రమే పాజిటివ్గా తేలింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇదే అత్యల్పం కావడం విశేషం. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.16%కి పడిపోయింది. గత 24గంటల వ్యవధిలో 11మంది మరణించారు. రికవరీ రేటు 98.12శాతంగా ఉంది.
* దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో డబుల్ డోస్ వ్యాక్సిన్లు అందించేందుకు వీలుగా డిసెంబర్ నాటికి భారత్లో 257 కోట్ల డోసులు ఉంటాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో టీకా కేంద్రాన్నిపరిశీలించారు. కరోనా సమయంలో ఇతర పార్టీల కార్యకర్తలు క్వారంటైన్ లేదా ఐసీయూలో ఉంటే భాజపా కార్యకర్తలు మాత్రం తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేశారని ప్రశంసించారు. మరోవైపు, కరోనాను వైరస్పై పోరులో కీలక అస్త్రమైన టీకా పంపిణీని మరింత వేగవంతం చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జులై- ఆగస్టు నాటికి వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్ వెళ్లారు.
* లాక్డౌన్ కారణంగా నిలిపివేసిన అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక మళ్లీ పునరుద్ధరించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడపనున్నట్టు కేఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 6గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని, ప్రయాణం సమయంలో ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
* కరోనా మూడో ముప్పు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తమ రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నట్టు రాజస్థాన్ ఆరోగ్యమంత్రి రఘు శర్మ తెలిపారు. 200లకు పైగా ఐసీయూ పడకలు జేకే లాన్ ఆస్పత్రిలో త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం అక్కడ 800 పడకలు ఉన్నట్టు చెప్పారు. 600 పడకలు కొవిడ్ రోగులకు రిజర్వు చేయవచ్చని తెలిపారు. అవసరమైతే వీటన్నింటినీ ఐసీయూ పడకలుగా మారుస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం