క్యాపిటల్ భవనంలోనే బైడెన్ ప్రమాణ స్వీకారం!
క్యాపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి.
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు తాను హాజరు కాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. హాజరవుతానంటూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ వంటి ఎందరో ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అమెరికా క్యాపిటల్ భవనంలో చోటుచేసుకున్న దాడి సంఘటన.. భద్రతా దళాల సంసిద్ధతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఉదంతం తమకు హెచ్చరికగా పనిచేసిందని.. రానున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లోపరహితంగా నిర్వహిస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకుగానూ తాము చేసిన ఏర్పాట్లను ఈ విధంగా వివరించాయి..
ప్రమాణ స్వీకారం ఎక్కడంటే..
కరోనా ఆంక్షల కారణంగా నాటి కార్యక్రమాలు కుదింపునకు గురయ్యాయి. వేడుకలు పరిమితమయ్యీయి. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోయే కమలా హారిస్లు అదే క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతంలో అధికారాన్ని చేపట్టాల్సి ఉంది. కాగా, ట్రంప్ అభిమానులు పోలీసు రక్షణను ఛేదించి మరీ లోపలికి ప్రవేశించిన ప్రదేశం కూడా ఇదే కావటం గమనార్హం. నాటి ఘటనలో ప్రదర్శనకారులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అప్పటికే ఏర్పాటు చేసిన మంచెలు, మెట్ల వరుసలను కూడా ధ్వంసం చేశారు.
రాజీలేని భద్రత
బుధవారం నాటి అనూహ్య సంఘటనతో క్యాపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి. జాతీయ స్థాయి ప్రత్యేక ప్రాముఖ్యత గల (ఎన్ఎస్ఎస్ఈ) 59వ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. జాతీయ నిఘా సంస్థ సీక్రెట్ సర్వీస్తో సహా డజన్ల కొద్దీ భద్రతా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తాయి. పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు. వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుంచి సుమారు 6200 మంది అదనపు భద్రతా సిబ్బంది.. క్యాపిటల్ పోలీసులకు సహాయంగా వాషింగ్టన్లో నెల రోజుల పాటు మకాం వేయనున్నారు. ఎక్కేందుకు సాధ్యం కాని విధంగా బ్లాక్ మెటల్తో చేసిన కంచెలను క్యాపిటల్ భవనం చుట్టూ హుటాహుటిన ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రహదారుల మూసివేత, దారిమళ్లింపు వ్యూహాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. ఓ సంవత్సర కాలంగా అమెరికా రహస్య సేవా విభాగం-యూఎస్ సీక్రెట్ సర్వీస్.. నేషనల్ స్పెషల్ సెక్యూరిటీ ఈవెంట్ (ఎన్నెస్సెస్సీ) తదితర ప్రభుత్వ భద్రతా సంస్థల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తోంది.
దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవు..
అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆహ్వానం పలికే ఈ కార్యక్రమానికి.. మామూలుగా ఐతే రెండు లక్షల మంది హాజరవుతారు. కాగా ఈసారి చట్టసభల సభ్యులు కాకుండా.. వారితో పాటు మరొకరికి మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి లభించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు ఏమీ క్లోబుచర్, రాయ్ బ్లంట్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరాటంకంగా నిర్వహించటం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవని.. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరూపిస్తామంటున్నారు. జనవరి 6 నాటి వైఫల్యం మరోసారి పునరావృతం కాకుండా.. ఆహూతులకు రాజీలేని భద్రత కల్పించటమే అగ్రరాజ్యం ప్రస్తుత కర్తవ్యమని వారు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?