వెనిజువెలాలో ఇకపై ‘10లక్షల’ నోట్లు!
మన దేశంలో నోట్ల రద్దుకు ముందు రూ. వెయ్యి నోటే అతిపెద్దది. ఆ తర్వాత వాటిని రద్దు చేసి రూ. 2వేల నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని చూసి చాలా మంది అంతపెద్ద నోటా అని ముక్కున వేలేసుకున్నారు. వందలు, ఐదు వందల నోట్లను కట్టలుగా తీసుకెళ్లే కన్నా..
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో నోట్ల రద్దుకు ముందు రూ. వెయ్యి నోటే అతిపెద్దది. ఆ తర్వాత వాటిని రద్దు చేసి రూ. 2వేల నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని చూసి చాలా మంది అంతపెద్ద నోటా అని ముక్కున వేలేసుకున్నారు. వందలు, ఐదు వందల నోట్లను కట్టలుగా తీసుకెళ్లే కన్నా.. ఈ రూ. 2వేల నోట్లను తీసుకెళ్తే సులువుగా ఉంటుంది కదా..! ఇదే కారణంతో వెనిజువెలా ప్రభుత్వం ఏకంగా 1 మిలియన్ బొలివర్స్(ఆ దేశ కరెన్సీ) నోట్లను తీసుకురానుంది. ప్రపంచంలో అత్యధిక విలువ చేసే నోటును జారీ చేస్తున్న ఏకైక దేశం ఇదే.
దక్షిణ అమెరికాలో భాగంగా ఉండే వెనిజువెలా ఒకప్పుడు అత్యంత ధనిక దేశం. అక్కడ చమురు, బంగారు నిక్షేపాలు సమృద్ధిగా ఉండేవి. ప్రభుత్వానికి 95శాతం రెవెన్యూ చమురు ద్వారానే లభించేది. అయితే, 1990ల్లో అధికారంలోకి వచ్చిన హ్యోగో చావెజ్ ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎక్కడ అప్పు దొరికితే అక్కడ విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి దేశంలో ఖర్చు చేశారు. ప్రజలకు ఆల్ ఫ్రీ పథకాలు అమలు చేసి సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో ఎవరికీ పని చెప్పకుండా ప్రతి వస్తువును విదేశాల నుంచి దిగుమతి తెచ్చుకున్నారు. చమురు ధరలు పెరిగినప్పుడు వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సంక్షేమ పథకాల పేరుతో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేశారు.
ధరలు నింగికి.. కరెన్సీ విలువ పాతాళానికి
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా..! చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశం అప్పుల్లో కూరుకుపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల భారం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీన్ని సరిచేయాలన్న ఉద్దేశంలో ఎక్కువ కరెన్సీ నోట్లను ముద్రించారు. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో కరెన్సీ విలువ పతనమైంది. సంచుల నిండా డబ్బులు తీసుకెళ్లినా కిలో టమోటా కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. 2013లో హ్యోగో చావేజ్ మరణించడంతో నూతన అధ్యక్షుడిగా నికోలస్ మదురో అధికారంలోకి వచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మన రూపాయితో పోలిస్తే వెనెజులా బొలివర్ మారకం విలువ రూ. 25,584గా ఉందంటే వెనిజువెలా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కప్పు కాఫీ తాగాలన్నా సంచుల నిండా నోట్ల కట్టలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. ఆ బాధ తప్పించడానికి, జాతీయ ఆర్థిక అవసరాలను అనుగుణంగా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ విలువవున్న కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుందట. ఇప్పటికే 10,000, 20,000, 50,000 బొలివర్స్ నోట్లను జారీ చేస్తుండగా.. తాజాగా 1 మిలియన్ బొలివర్ నోట్లను ముద్రించడానికి సిద్ధమైంది. 1 మిలియన్ బొలివర్స్ మన దేశ కరెన్సీలో దాదాపు రూ.39తో సమానం. ఈ నోట్లే కాకుండా.. 2లక్షలు, 5లక్షల నోట్లను కూడా ముద్రిస్తారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..