PLA: మణిపూర్లో మళ్లీ పీఎల్ఏ కదలికలు..?
మణిపూర్లో అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి సహా అతని భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, నలుగురు అంగరక్షల హత్యతో
నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉగ్రసంస్థ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
మణిపూర్లో అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి సహా అతని భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, నలుగురు అంగరక్షల హత్యతో ‘పీఎల్ఏ’ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దీంతోపాటు మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ కూడా ఈ ఘాతుకంలో పాలుపంచుకొంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఉగ్ర సంస్థ ఈశాన్య భారతంలో అరాచకం సృష్టిస్తోంది. దీనికి వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. విప్లవ్ త్రిపాఠి మరణానికి ప్రతికారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు యత్నాలను వేగవంతం చేశాయి.
ఏమిటీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ..?
‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ మణిపూర్లోని ఓ ఉగ్ర సంస్థ. దీనిని 1978లో ఎన్.బిషేశ్వర్ ప్రారంభించారు. యూఎన్ఎల్ఎఫ్(యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్) నుంచి వేరుపడి ఆయన దీనిని ఏర్పాటు చేశారు. అందులోని కేడర్ కూడా పీఎల్ఏలో చేరింది. 1979లో దీని రాజకీయ విభాగం ‘రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్’ (ఆర్పీఎఫ్)ను ఏర్పాటు చేశారు. మణిపూర్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చాలన్నది దీని లక్ష్యం. ఇందుకోసం కుకీ, నాగా వేర్పాటువాద బృందాలతో కూడా కలిసి పనిచేసేందుకు పీఎల్ఏ సిద్ధపడింది.
ఇంఫాల్ లోయలో పీఎల్ఏ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. మార్కిస్ట్ భావజాలంతో ఈ గ్రూపు పనిచేస్తోంది. ఈ గ్రూప్కు సంబంధించిన కీలక క్యాంప్లు మయన్మార్లో ఉన్నాయి. వీరి శిక్షణ కూడా అక్కడే కొనసాగుతోంది. మణిపూర్లో ప్రభుత్వం పలు వేర్పాటువాద సంస్థలతో ఒప్పందాలు చేసుకొని.. వారిని హింసాత్మక మార్గం నుంచి జనజీవన స్రవంతిలోకి తెచ్చింది. కానీ, పీఎల్ఏ మాత్రం ప్రభుత్వంతో ఎటవంటి ఒప్పందాలు చేసుకోలేదు.
దాడికి చురాచాంద్పూర్నే ఎందుకు ఎంచుకొంది..?
వాస్తవానికి తాజాగా దాడికి చురాచాంద్పూర్ను పీఎల్ఏ ఎంచుకోవడం భద్రతా వర్గాలను కొంత గందరగోళానికి గురిచేసింది. గతంలో జరిగిన పెద్ద దాడులకు మయన్మార్ సరిహద్దుల్లోని ఛండేల్ జిల్లా వేదికగా ఉంది. 2015లో డోగ్రా రెజిమెంట్పై దాడి చేసి 18 మంది సైనికులను హత్య చేసిన ఘటన కూడా ఛండేల్లో చోటుచేసుకొంది.
2003-04లో చేపట్టిన ఆపరేషన్ ఆల్ క్లియర్ దెబ్బకు ఇక్కడి వేర్పాటు వాద సంస్థలను మయన్మార్ నుంచి తరిమేశారు. దీంతోపాటు దాదాపు 20కి పైగా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వేర్పాటు వాదం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంఫాల్ లోయలోని ఉగ్ర గ్రూపులు మయన్మార్ను ఆనుకొని ఉన్న ఈ జిల్లా నుంచి పనిచేయవు. ఎందుకంటే ‘ది జోమి రివల్యూషనరీ ఆర్మీ’ (జెడ్ఆర్ఏ)పేరిట వేరే గ్రూపు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జెడ్ఆర్ఏ అనుమతి లేకుండా ఈ ప్రాంతం నుంచి పీఎల్ఏ దాడి చేయడం అసంభవం. అయితే ఈ గ్రూపులు కలిసి పనిచేస్తున్న విషయాన్ని నిఘా వర్గాలు గ్రహించలేకపోయాయి.
మరోపక్క మయన్మార్లో తిరుగుబాటు జరిగి సైన్యం అధికారం చేపట్టాక పరిస్థితులు మారాయి. చురాచాంద్పూర్ను అనుకొని ఉన్న చిన్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సమాంతర పాలన నడిపే ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ సాయుధ విభాగమైన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ భారత వేర్పాటు వాద గ్రూపులపై దాడులు చేసింది. దీంతో ఆ గ్రూపులు మళ్లీ భారత్లోకి వచ్చిచేరినట్లు అనుమానిస్తున్నారు.
1990ల తర్వాత ఇప్పుడే..
1990ల్లో నాగాలు, కుకీల మధ్య ఘర్షణల సమయంలో మహిళలు పిల్లలను లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఇక్కడి ఉగ్ర సంస్థలు వీరిని లక్ష్యంగా చేసుకోలేదు. తాజా దాడి తర్వాత కూడా పీఎల్ఏ, ఎంఎన్ఎఫ్లు స్పందిస్తూ.. వాహనంలో కమాండింగ్ ఆఫీసర్ భార్య, కుమారుడు ఉన్న విషయం తెలియదని చెప్పాయి. దాదాపు ఐదారేళ్లుగా స్తబ్దుగా ఉన్న పీఎల్ఏ ఒక్కసారిగా భారీ దాడి చేయడం భద్రతా దళాలను కలవర పరుస్తోంది.
చర్చలకు రాని మెయితియ్ లోయ గ్రూపులు..
ప్రస్తుతం మణిపూర్లో మొత్తం ఆరు గ్రూపులు చురుగ్గా ఉన్నాయి. వీటిల్లో యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏ, కేసీపీ, కేవైకేఎల్, పీఆర్ఈపీఏకే, ఎంపీఎల్ఎఫ్ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడి ఆ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేస్తోన్నాయి. ఈ గ్రూపులు భారత దళాలపై దాడులకు గెరిల్లా యుద్ధతంత్రాలను వాడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!