ఓటీటీలో మెరిసిన అగ్ర తార ఎవరు?
‘‘హీరోకి జోడీగా తెరపై గ్లామర్ ఒలికించడం.. స్టెప్పులతో సినీప్రియుల్ని మురిపించడం..సినిమాల్లో నాయికల పాత్ర ఇక్కడికే పరిమితం’’.. - కథానాయికల
‘‘హీరోకి జోడీగా తెరపై గ్లామర్ ఒలికించడం.. స్టెప్పులతో సినీప్రియుల్ని మురిపించడం..సినిమాల్లో నాయికల పాత్ర ఇక్కడికే పరిమితం’’.. - కథానాయికల విషయంలో ఇలాంటి మాటలు గతంలో బాగా వినిపించేవి. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే మంత్రాన్ని, సోలోగా సినీప్రియుల్ని రంజింపజేసే తంత్రాన్ని కథానాయికలు ఎప్పుడో చక్కగా వంటబట్టించేసుకున్నారు. మంచి కథతో దగ్గరకి రావాలే కానీ.. అగ్ర హీరోలకు దీటుగా బాక్సాఫీస్ ముందు దుమ్ములేపుతున్నారు. నయనతార, అనుష్క, కీర్తిసురేష్ లాంటి స్టార్ నాయికలంతా ఈ విషయంలో ఎప్పుడో ఆరితేరారు. ఇప్పుడీ భామలే కరోనా కాలంలోనూ ఓటీటీ వేదికగా సినీప్రియులకు వినోదాల విందు అందించారు. వెండితెరపై అగ్ర హీరోలు కనిపించని లోటును.. తమ చిత్రాలతో భర్తీ చేసి చూపించారు. మరి వీళ్లలో హిట్టు మాట వినిపించుకున్న ఆ నాయికలెవరో? చదివేద్దాం...
కీర్తి డబుల్ ట్రీట్..
‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసి.. నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది కీర్తి సురేష్. ఈ ఏడాది ఓటీటీ వేదికగా ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలతో సినీప్రియులకు వినోదాల విందు వడ్డించింది. కీర్తి ‘పెంగ్విన్’తో ఓటీటీలోకి అడుగుపెట్టాకే.. ‘వి’, ‘నిశ్శబ్దం’ లాంటి బడా చిత్రాలూ ఈ వేదికల వైపు అడుగులు వేశాయి. ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో కాస్త తడబడినా.. ఓటీటీ వైపు సినీప్రియుల్ని ఆకర్షితుల్ని చేయడంలో పైచేయి సాధించింది. ఇక ఇటీవల విడుదలైన ‘మిస్ ఇండియా’ మాత్రం మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్లక్ సఖీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా ఓటీటీ వైపే అడుగువేయనుందని సమాచారం.
‘నిశ్శబ్దం’గా వచ్చి వెళ్లిన స్వీటీ..
నాయికా ప్రాధాన్య చిత్రాలతో బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించిన నాయికల్లో అందరి కంటే ఓ మెట్టు పైన ఉంటుంది అనుష్క. వెండితెరపై ‘భాగమతి’గా ఆమె విశ్వరూపం చూశాక..దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమెను తెరపై చూసే వీలు కలగలేదు. ఆ నిరీక్షణలకు ఈ లాక్డౌన్లోనే ‘నిశ్శబ్దం’గా తెరదించింది అనుష్క. ఓ విభిన్నమైన థ్రిల్లర్ కథాంశంతో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే సినీప్రియులకు వినోదాన్ని పంచింది స్వీటీ. ఇందులో బధిర యువతిగా అనుష్క అభినయం అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. కథ, కథనాల పరంగా ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం కూడా సినీ ప్రియుల్ని ఓటీటీ వైపు ఆకర్షితుల్ని చేయడంలో విజయం సాధించిందనే చెప్పాలి.
నవ్వుల ‘అమ్మోరు తల్లి’..
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయికగా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఓవైపు అగ్రహీరోలతో ఆడిపాడుతూనే నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది. ఇటీవలే ‘అమ్మోరు తల్లి’ చిత్రంతో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించింది. భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ అభినయం.. ఆ పాత్రలో ఆమె పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మవారి పాత్రలో ఆమె దైవత్వం ఎలా చూపించిందో.. వినోదాత్మక సన్నివేశాల్లో అంతే నవ్వించి మెప్పించింది. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.
అనుకోని అతిథిలా.. పాయల్
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో యువతరాన్ని అలరించిన నాయిక పాయల్ రాజ్పుత్. ఇటీవల కాలంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్డౌన్లో ‘అనుకోని అతిథి’లా ఓటీటీ వేదికగా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ చిత్రంలో.. మల్లి అనే ప్రతినాయిక ఛాయలున్న డీగ్లామర్ పాత్రలో పాయల్ ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు కథ నడిపించిన విధానం.. పాయల్ పాత్రని తీర్చిదిద్దిన తీరు.. నేపథ్య సంగీతం.. ఇవన్నీ ప్రేక్షకులనెంతో మెప్పించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి