సుధీర్‌ స్కిట్‌.. వెళ్లిపోతా: రోజా 

హైదరాబాద్‌: గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, రష్మిల కామెడీ టైమింగ్‌తోపాటుకమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. 

Published : 17 Nov 2020 01:42 IST

హైదరాబాద్‌: గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, రష్మిల కామెడీ టైమింగ్‌తోపాటు కమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. 

షోలో భాగంగా సుడిగాలి సుధీర్‌ టీమ్‌, రోజా మధ్య జరిగే సంభాషణలు తరచూ నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. అయితే త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో భాగంగా సుధీర్‌ టీమ్‌.. ఖైదీలుగా మారి.. తమకి కొన్ని డిమాండ్స్‌ ఉన్నాయనడంతో.. దాంతో రోజా.. తాను స్టేజ్‌పై నుంచి వెళ్లిపోతానంటూ వరుస పంచులు వేయనున్నారు. అంతేకాకుండా సుధీర్‌ స్కిట్‌ సమయంలో తాను కుర్చీలోనే ఉండనంటూ సరదాగా నవ్వులు పూయించనున్నారు. మరోవైపు రాకింగ్‌ రాకేశ్‌ చిన్నారులతో దెయ్యం గెటప్‌ వేసుకుని సెట్‌లో ప్రతిఒక్కర్నీ భయపెట్టనున్నారు. అదిరే అభి.. శివశంకర్‌ మాస్టర్‌ వచ్చే శుక్రవారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ స్టేజీపై సందడి చేయనున్నారు. నవంబర్ 20న ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని