Adavallu meeku joharlu: ఆద్య ఆరాధనలో...

శర్వానంద్‌ కథానాయకుడిగా కిషోర్‌  తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన్న కథానాయిక. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి

Updated : 14 Feb 2022 09:12 IST

ర్వానంద్‌ కథానాయకుడిగా కిషోర్‌  తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన్న కథానాయిక. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని సోమవారం ఈ చిత్రంలోని ఆద్య... పాటని విడుదల చేస్తారు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ‘‘కుటుంబ వినోదంతో రూపొందిన చిత్రమిది. ఆద్యని ఆరాధిస్తూ మా కథానాయకుడు పాడుకునే పాట ఆకట్టుకుంటుంది. శర్వానంద్‌, రష్మిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కీ, టైటిల్‌ గీతానికి చక్కటి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మనసుల్ని గెలుచుకుంటుంద’’ని చెప్పాయి సినీ వర్గాలు. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశి, వెన్నెల కిషోర్‌, రవిశంకర్‌, సత్య, ప్రదీప్‌రావత్‌ నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌, కూర్పు:  శ్రీకర్‌ప్రసాద్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని