సుశాంత్ మృతి: చివరి గంటల్లో ఇలా..
సుశాంత్ సోదరి మీటూ అక్కడకు చేరుకుని ‘‘గుల్షన్, నువ్వేం చేశావు బాబూ...!’’ అని విలపించారు.
సీబీఐకి వివరించిన ప్రత్యక్ష సాక్షులు
ముంబయి: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దీనిలో భాగంగా సుశాంత్ చనిపోయిన రోజు ఆయన ఇంటిలో ఉన్న నలుగురు వ్యక్తులను విచారించింది. సుశాంత్తో పాటు ఆ ఫ్లాట్లో నివసించే సిద్దార్ధ్ పితానీ, సహాయకుడు నీరజ్, వంటమనిషి కేశవ్, ఇంటిపని చేసే దీపేశ్ సావంత్లను సీబీఐ ప్రశ్నించింది. సుశాంత్ జీవితంలో ఆఖరు కొద్ది గంటల్లో ఏం జరిగింది... అనే కీలక సమాచారాన్ని వారి నుంచి రాబట్టింది.
* జూన్ 13, రాత్రి: భోజనం వద్దన్న సుశాంత్, మ్యాంగో షేక్ కావాలని అడిగారు. మిగిలిన అందరిని తినాలని సూచించారు. అనంతరం రాత్రి 10:30 గం.కు సుశాంత్కు ఫోన్ చేయగా... ఆయన స్పందించకపోవటంతో, నిద్రపోయినట్టు భావించానని వంటమనిషి కేశవ్ తెలిపాడు.
*జూన్ 14, ఉదయం 5:30గం.: తొలుత నిద్ర మేల్కొన్న ఇంటి పనిమనిషి దీపేశ్.. ఒక గంట తర్వాత మేడపై ఉన్న సుశాంత్ గదికి వెళ్లాడు. అప్పటికే లేచి బెడ్పై కూర్చొని ఉన్న సుశాంత్ను టీ కావాలా అని అడగ్గా.. తనకు టీ, టిఫిన్ వద్దని సుశాంత్ అన్నారు.
* ఉదయం 7:00 గం.: వంటవాడు కేశవ్, సహాయకుడు నీరజ్ నిద్రలేచారు.
*ఉదయం 8:00 గం.: నీరజ్, సుశాంత్ను కింద నుంచి పిలవగా.. ఆయన మెట్లపైకి వచ్చి చల్లని నీరు కావాలని అడిగారు.
*ఉదయం 9:15 గం.: కేశవ్ దానిమ్మ రసం, కొబ్బరినీరు ఇచ్చేందుకు సుశాంత్ గదికి వెళ్లారు. తను అతన్ని చూడటం అదే ఆఖరుసారి అని కేశవ్ తెలిపారు.
*ఉదయం 10:30 గం.: భోజనంలోకి ఏం కావాలని అడిగేందుకు కేశవ్, సుశాంత్ గదికి వెళ్లగా.. తలుపు లోపలనుంచి మూసి ఉంది. రియా వచ్చినప్పుడు తప్ప సుశాంత్ గది తలుపులు ఎప్పుడూ మూసేవారు కాదని... దీనితో ఆందోళన చెందామని నలుగురూ చెప్పారు.
*ఉదయం 10:30 గం.: సుశాంత్ గది తలుపు మరోసారి తట్టగా.. ఆయన స్పందించలేదు. సుశాంత్ సోదరి ఫోన్లో సూచించిన ప్రకారం మరింత గట్టిగా తలుపు తట్టారు.
*ఉదయం 11:15 గం.: మధ్యమధ్యలో సుశాంత్ గది తలుపు తడుతూ, ఆయన గది ముందు ఆందోళనతో తిరిగారు. అనంతరం ఆ గది మారుతాళం కోసం వెతికారు. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాకు ఫోన్చేయగా ఆయన లేవని చెప్పారు. సెక్యూరిటీ గార్డు రాజును అడగ్గా, వెతికి చూస్తానని చెప్పాడు.
*మధ్యాహ్నం 12:15 గం.: తాళాలు బాగుచేసే వ్యక్తిని పిలవాలని నిర్ణయించుకుని, సుశాంత్ సోదరికి ఫోన్ చేసి చెప్పారు. ఆన్లైన్లో తాళాలు బాగుచేసే ఓ వ్యక్తిని సంప్రదించగా అతను వచ్చి.. తాళం విరగగొట్టి రూ.2000 తీసుకుని వెంటనే వెళ్లిపోయాడు. అతనికి అది సుశాంత్ గది అని ఆ వ్యక్తికి తెలియదని సాక్షులు చెప్పారు.
లోపలకు వెళ్లి చూస్తే...
అనంతరం సుశాంత్ గదిలోకి దీపేశ్, సిద్దార్ధ్ వెళ్లగా మిగిలిన వారు బయటే ఉండిపోయాడు. గదిలో లైట్లు ఆపి, కర్టెన్లు మూసి ఉన్నాయి. వారు లైటువేసి, సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఉండటం చూసి షాక్కు గురయ్యారు. సుశాంత్ సోదరికి సిద్దార్ధ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అంబులెన్స్, వైద్య సహాయం కోసం 108కు ఫోన్ చేశారు. బాధితులు ఎవరని వారు మరీ మరీ అడగటంతో సుశాంత్ పేరు వెల్లడించానని సిద్దార్ధ్ వివరించాడు.
గుల్షన్, ఏం చేశావు బాబూ...
ఇంతలో సుశాంత్ పెద్దక్క ప్రియాంక ఫోన్ చేశారు. సుశాంత్ను కిందికి తెచ్చి, ఆయనకు ఊపిరి ఆడుతోందా లేదా చూడాల్సిందిగా ఆమె భర్త సూచించటంతో.. వారు అలానే చేశారు. ఇంతలో మరో సోదరి మీటూ అక్కడకు చేరుకుని ‘‘గుల్షన్, నువ్వేం చేశావు బాబూ...!’’ అని విలపించారు. సుశాంత్ ప్రాణం నిలబెట్టేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించామని ఇంతలో పోలీసులు వచ్చారని సాక్షులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం