గుండెల్లో మోసుకెళ్లే చిత్రం... ‘రిపబ్లిక్’
‘‘సినిమాలు మొదలు పెట్టాక నేను మా అన్నయ్య సహకారం తీసుకోలేదు. మా మేనల్లుళ్లు తేజ్, వైష్ణవ్ కూడా సొంత కాళ్లపై నిలబడాలనే సూచించా. అందుకే వాళ్ల సినిమాల వేడుకలకి నేను గతంలో హాజరు కాలేదు’’ అన్నారు...
‘‘సినిమాలు మొదలు పెట్టాక నేను మా అన్నయ్య సహకారం తీసుకోలేదు. మా మేనల్లుళ్లు తేజ్, వైష్ణవ్ కూడా సొంత కాళ్లపై నిలబడాలనే సూచించా. అందుకే వాళ్ల సినిమాల వేడుకలకి నేను గతంలో హాజరు కాలేదు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్కల్యాణ్. ఆయన ముఖ్య అతిథిగా శనివారం రాత్రి హైదరాబాద్లో ‘రిపబ్లిక్’ ముందుస్తు విడుదల వేడుక జరిగింది. సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. దేవా కట్టా దర్శకత్వం వహించారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఈ రోజు ప్రత్యేకించి ఈ వేడుకకి రావడానికి కారణం నిర్మాతలు. ఇంత ఖర్చుపెట్టి సినిమా తీశారు. అందరూ ఆనందంగా ఉండాల్సిన విడుదల సమయంలో తేజ్ మోటర్బైక్ ప్రమాదానికి గురి కావడం బాధాకరమైన విషయం. నిర్మాతలకి ఆ హీరో అందుబాటులో లేని లోటు కనిపించకుండా ఏదో ఒకటి చేయాలని ఈ వేడుకకి వచ్చా. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయి తేజ్. తను నటించిన ఈ సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని అర్థమవుతోంది ట్రైలర్ చూస్తుంటే. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. కథానాయకుడు వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘అన్నయ్య సాయి తేజ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ప్రమాద సమయంలో వేగంగా స్పందించి అన్నయ్యని ఆస్పత్రికి తీసుకెళ్లిన అందరికీ కృతజ్ఞతల’’న్నారు. దేవా కట్టా మాట్లాడుతూ ‘‘పవన్కల్యాణ్ గళాన్ని, వ్యక్తిత్వాన్ని ఆరాధించే వ్యక్తిగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. ఆయన ఈ వేడుకకి రావడం వల్ల మాకెంతో మేలు జరుగుతోంది. మేమంతా ఇక్కడి వరకు రావడానికి కారణం తేజ్నే. నాకు చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చి ఈ సినిమాని పూర్తి చేసేలా తోడ్పాటుని అందించారు. కథ చెప్పిన రోజు నుంచి పూర్తిగా నాపైనే వదిలేశారు నిర్మాతలు. ఈ సినిమాలోని ప్రతి మాట ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందని ఆశిస్తున్నా. థియేటర్లో వదిలిపోయే సినిమా కాకుండా గుండెల్లో మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లే సినిమా అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వరుసగా రెండు విజయాల తర్వాత సాయితేజ్ ఒప్పుకొన్న కథే... ఈ ‘రిపబ్లిక్’. తన మనసు బంగారం. ఈ సినిమా ప్రారంభమయ్యాక రెండు దశల్లో కరోనా, రెండుసార్లు లాక్డౌన్ని ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డామ’’న్నారు. క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ ‘‘రిపబ్లిక్’ సాయి తేజ్కే కాదు, పరిశ్రమకి కూడా చాలా ముఖ్యమైన చిత్రం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి చిత్రబృందం అందరికీ మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దిల్రాజు మాట్లాడుతూ ‘‘దేవా కట్టా తపన ఉన్న దర్శకుడు. తేజ్కి ప్రమాదం జరిగినా సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతోందంటే మెగా అభిమానులే కారణ’’మన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని, మారుతి, బి.వి.ఎస్.రవి, కిషోర్ తిరుమల, రవివర్మ, మనోజ్ నందం, శ్రీకాంత్, సుకుమార్, ఐశ్వర్య రాజేశ్ కళామందిర్ కల్యాణ్, నవీన్రెడ్డి, నవీన్, ప్రసాద్ నిమ్మకాయల పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి