ఆ చిత్రానికి 20 ఏళ్లు..!
‘ఆన.. ఆన.. అమ్మ మీద ఆన.. పల్నాటి సీమ మీద ఆన.. అందరూ వస్తే గీత దాటి రండి.. ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి.. పలికే పళ్లు జాగ్రత్త.. చూసే కళ్లు జాగ్రత్త.. రాలిపడతాయ్’ అంటూ సమాజంలోని దౌర్జన్యాలపై వెంకటేశ్ కన్నెర్ర చేసిన చిత్రం ‘జయం మనదేరా!’. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై బుధవారంతో...
ఆసక్తికర విషయాలు తెలుసా..!
హైదరాబాద్: ‘ఆన.. ఆన.. అమ్మ మీద ఆన.. పల్నాటి సీమ మీద ఆన.. అందరూ వస్తే గీత దాటి రండి.. ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి.. పలికే పళ్లు జాగ్రత్త.. చూసే కళ్లు జాగ్రత్త.. రాలిపడతాయ్’ అంటూ సమాజంలోని దౌర్జన్యాలపై వెంకటేశ్ కన్నెర్ర చేసిన చిత్రం ‘జయం మనదేరా!’. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై బుధవారానికి 20 సంవత్సరాలు. వెంకటేశ్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ఈ సినిమాలో భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు.
కథేంటి: అభిరామ్(వెంకటేశ్) లండన్లో స్థిరపడిన తెలుగు కుర్రాడు. థమ్సప్ లక్కీడ్రాలో యూరప్ చూసేందుకు వచ్చిన ఎనిమిది మంది తెలుగు వారికి గైడ్గా వెళతాడు. టూర్లో భాగంగా ఉమ(సౌందర్య)తో పరిచయం ఏర్పడుతుంది. అలా వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఉమ ప్రేమ గురించి తెలుసుకున్న అభిరామ్ తండ్రి గంగాధరం నాయుడు (ఆహుతి ప్రసాద్) ఓ రోజు పార్టీలో ఆమెను అవమానించేలా మాట్లాడతాడు. ఆయన మాటలకు నొచ్చుకున్న ఉమ ఎవరికీ చెప్పకుండా భారత్కి వచ్చేస్తుంది. ఉమ ప్రేమను తెలుసుకున్న అభిరామ్ తండ్రితో గొడవపడి ఆమె కోసం ఇండియాకి వస్తాడు. ఆ సమయంలో నరసింహానాయుడు(జయప్రకాశ్ రెడ్డి) మనుషులు అభిరామ్పై దాడికి దిగుతారు. ప్రమాదంలో ఉన్న అభిరామ్ని భవానీ(ఝాన్సీ) రక్షిస్తుంది. అనంతరం వారిద్దరూ మహాదేవనాయుడు(వెంకటేశ్), భువనేశ్వరి(భానుప్రియ) దంపతులకు పుట్టిన సంతానమని చెబుతుంది. సమాజంలోని వర్ణ, కుల వివక్ష రూపుమాపడానికి తమ తండ్రి చేసిన పోరాటం గురించి అభిరామ్కి తెలియజేస్తుంది. సమాజంలో అరాచకాలకు పాల్పడుతున్న నరసింహానాయుడు, అతని సోదరులు కలిసి.. మహాదేవనాయుడిని మోసం చేసి విషం పెట్టి చంపారని వివరిస్తుంది. దీంతో తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న అభిరామ్.. నరసింహానాయుడి కుటుంబాన్ని ఎలా శిక్షించాడు? తల్లిని ఎలా కాపాడుకున్నాడు? అలాగే తన తండ్రి మరణంతో ఊరు నుంచి వెళ్లిపోయిన ప్రజల్ని ఎలా తన సొంతూరికి రప్పించాడు అనేది కథ.
‘జయం మనదేరా’ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా సంగీతం విషయంలో ఓ చిన్న సంఘటన ఉంది. ఎన్.శంకర్కి మొదటి చిత్రం నుంచి వందేమాతరం శ్రీనివాస్తో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. అదే విషయాన్ని వెంకటేశ్కి చెప్పగా.. ‘ఆయన విప్లవ సినిమాలకు సంగీతం అందిస్తారు కదా! ఈ సినిమాకు చేయగలరా’ అని అడిగారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఒక షరతు పెట్టింది. ‘ఈ సినిమాలో మీరిచ్చే పాటలు నచ్చితే.. సంగీత దర్శకుడిగా మీ పేరు వేస్తాం. లేకపోతే వేయం’ అని చెప్పడంతో శ్రీనివాస్ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని సినిమాకి మంచి పాటలు అందించారు.
‘జయం మనదేరా’ సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా సృజనాత్మక విభేదాలు వచ్చాయని దర్శకుడు ఎన్.శంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా కోసం తాను రాసుకున్న ఒరిజినల్ క్లైమాక్స్ వేరేలా ఉంటుందట. అయితే తాను చెప్పిన క్లైమాక్స్ విన్న వెంకటేశ్.. సినిమాలోని చివరి సన్నివేశాలు కొంచెం మాస్గా ఉండాలని.. ఓ హిందీ సినిమాలో ఉన్నట్లు చేద్దామని అన్నారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్.. ‘రెండు క్లైమాక్స్లూ చిత్రీకరిద్దాం. ఏది బాగుంటే దాన్ని పెట్టి సినిమా విడుదల చేద్దాం’ అని చెప్పిందట. దీంతో మొదట హిందీ సినిమాని ఆధారంగా చేసుకుని ఓ మాస్ క్లైమాక్స్ని చిత్రీకరించారు. సమయం లేకపోవడంతే ఆ క్లైమాక్స్తోనే సినిమాని విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే