Aadavallu Meeku Johaarlu: నవ్వించిన శర్వా.. మళ్లీ కావాలని అడిగారు
‘‘కుటుంబ వినోదంతో నిండిన సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది.
‘‘కుటుంబ వినోదంతో నిండిన సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది. వాళ్లందరి కోరిక నెరవేర్చే సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఓ చిరునవ్వుతో ఇంటికెళ్లేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన్న కథా నాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిండా ఆడవాళ్లే కనిపిస్తారు. యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఎంతగా ఆస్వాదించానో, చిత్రీకరణ దశలోనూ... నిర్మాణానంతర కార్యక్రమాల సమయంలోనూ అదే స్థాయిలో నవ్వుకున్నా. ఖుష్బూ, రాధికలాంటి సీనియర్లతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దేవిశ్రీప్రసాద్తో కలిసి ఇది నాకు నాలుగో సినిమా. చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘‘ఆడవాళ్లందరి మధ్య కూర్చుని చాలా సరదాగా చేసిన సినిమా ఇది. కామెడీ కోసమని ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథలో భాగంగానే ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశా. కిషోర్ ఓ బలమైన కథతో, మంచి పేరుతో వచ్చారు. రాధిక, ఖుష్బూ తదితర నటులతో కలిసి నటించడం ఓ లక్ష్యాన్ని చేరుకున్న అనుభూతినిచ్చింది. రష్మిక చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది’’ అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘దర్శకుడు కిషోర్ ఈ కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నా. సినిమా చిత్రీకరణలోనూ అంతే. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు’’ అన్నారు. ‘‘తెలుగులో 250కిపైగా సినిమాలు చేశా. ఈ చిత్రంతో మరో మంచి జ్ఞాపకం. ప్రతీ పాత్రకీ మంచి ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబంతో కలిసి చూడాలి’’ అన్నారు రాధికా శరత్కుమార్. నటి ఖుష్బూ మాట్లాడుతూ ‘‘కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శర్వానంద్ ఈ సినిమాకి మూలస్తంభం’’ అన్నారు ఖుష్బూ. నటి ఝాన్సీతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్కు గురిపెట్టి!
కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
పెళ్లి తేలికైన విషయం కాదు!
-
బాహుబలి నుంచి యానిమేటెడ్ సిరీస్
ప్రభాస్ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్ సిరీస్ రానుంది. -
సీమ కథతో తొలిసారి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో ఓ సినిమా చేయనున్నారు. -
అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు
‘కెరీర్లో జయాపజయాలు సహజం. అవి ఎంతమాత్రం నాపై ప్రభావం చూపించవు. ప్రేక్షకులు మెచ్చేలా నటించుకుంటూ వెళ్లడమే నా పని’ అంటోంది అలయా ఎఫ్. ఇటీవలే తను నటించిన ‘బడేమియా ఛోటేమియా’ భారీ వసూళ్లు రాబట్టడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా బదులిచ్చింది అలయా. -
వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. -
ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర