ఆచార్య: చిరు-చరణ్‌ కీలక షెడ్యూల్‌ ముగిసింది

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి ఖమ్మం జిల్లా సింగరేణి గనుల్లో షూటింగ్‌ చేశారు. ఈ షూట్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్న

Published : 10 Mar 2021 17:36 IST

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఖమ్మం జిల్లా సింగరేణి గనుల్లో షూటింగ్‌ చేశారు. సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్‌ నటించారు. తాజాగా ఈ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని చిరు తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరును కథాంశంగా తీసుకుని సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో చిరు మార్కు యాక్షన్‌ ఘట్టాలు కనిపించాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా మే 13న ‘ఆచార్య’ థియేటర్లలోకి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని