Adipurush: ఆదిపురుష్ సినిమా కాదు... ఓ భావోద్వేగం!
‘‘ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి గుండెలోనూ రాముడు ఉన్నాడు. మనందరిలో ఉన్న రాముడిని బయటికి తీసుకురావడానికి ప్రభాస్ ఈ సినిమా చేశాడ’’న్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి.
- ప్రభాస్
‘‘ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి గుండెలోనూ రాముడు ఉన్నాడు. మనందరిలో ఉన్న రాముడిని బయటికి తీసుకురావడానికి ప్రభాస్ ఈ సినిమా చేశాడ’’న్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి. ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం తిరుపతిలో ‘ఆదిపురుష్’ (Adipurush) విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా నటించారు. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించారు. ఓం రౌత్ దర్శకుడు. భూషణ్కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 16న తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ వేడుకని ఉద్దేశించి చినజీయర్ స్వామి మాట్లాడుతూ ‘‘నిజమైన ‘బాహుబలి’ రాముడే అని లోకానికి నిరూపించడం కోసమే ఈ సినిమా చేశారు. అందుకే మేం ఈ వేడుకకి వచ్చాం. మానవ జాతికి మంచి మార్గాన్ని చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా ఈ మట్టిమీద నడిచి పావనం చేసిన మహాపురుషుడు. మానవ జాతికి ఆదర్శమైన పురుషుడు. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన కథని చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేశామని చెప్పారు దర్శకుడు. ఇంతకంటే లోకానికి మహోపకారం మరొకటి ఉండదు. ఇలాంటివి మరిన్ని చేసే శక్తి ఆ భగవంతుడు ఈ బృందానికి ఇవ్వాలని కోరుకుంటున్నా. రామాయణం ఆధారంగా సినిమాలు చాలా వచ్చాయి. కానీ తరం గడిచింది. ఈ తరానికి, దేశానికీ, ప్రపంచానికి మళ్లీ రాముడు కావాలి. ఈ తరానికి తగ్గ సాంకేతికతో చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘‘యువతీ యువకులకి ఆదర్శంగా ఉండేలా సినిమాని నిర్మించారు. ఇలాంటి గొప్ప చిత్రం నిర్మించినందుకు బృందాన్ని అభినందిస్తున్నా’’ అన్నారు. టి.సిరీస్ అధినేత భూషణ్కుమార్ మాట్లాడుతూ ‘‘రామాయణం ఆధారంగా సినిమా తీయాలనేది మా నాన్న గుల్షన్కుమార్ కోరిక. ఆయన కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఓం రౌత్ వల్లే ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఆయన విజన్ గొప్పగా ఉంటుంది. తెరపై చూసి తరించాల్సిందే. మా అమ్మ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. మాకు ఇది సినిమా కాదు, ఓ భావోద్వేగం’’ అన్నారు.
దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ ‘‘ప్రభాస్ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఇది ఏ ఒక్కరి సినిమానో కాదు, భారతీయ సినిమా. మా నిర్మాత భూషణ్ నాకు ఈ చిత్రం చేసే అవకాశాన్నిచ్చారు. ఆయన తండ్రి కల ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కృతిసనన్ మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోనే నా కెరీర్ని మొదలుపెట్టాను. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపై ఉన్నా. ఇది చాలా విలువైన సినిమా నాకు. జానకి చాలా ప్రత్యేకమైన పాత్ర. కొద్దిమంది నటులకి మాత్రమే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఈ అవకాశం నాకు దొరికింది. జానకి పాత్ర నన్ను ఎంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇది అన్ని పాత్రల్లా కాదు. సీతమ్మ పాత్ర చాలా శక్తివంతమైనది. ఎంతో స్వచ్ఛత, ప్రేమ ఉన్న ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు కలిగిన అనుభూతే వేరు’’ అన్నారు. కార్యక్రమంలో చినజీయర్ స్వామి కథానాయకుడు ప్రభాస్తోపాటు చిత్రబృందాన్ని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
రామాయణం... మా అదృష్టం: ప్రభాస్
‘‘ఏడు నెలల ముందు త్రీడీలో నా అభిమానుల కోసం టీజర్ని చూపించండని దర్శకుడిని అడిగా. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ బృందాన్ని ముందుకు నడిపించింది. ట్రైలర్ని కూడా మళ్లీ అభిమానులకి చూపించాలని కోరా. అభిమానులే బలం. ఈ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక బృందం ఎనిమిది నెలలు యుద్ధం చేసింది. ఒకొక్కళ్లు రోజుకి 20 గంటలపాటు పని చేశారు. ఇది సినిమా కాదు... మా అదృష్టం. చిరంజీవి సర్ని కలిసినప్పుడు ‘రామాయణం చేస్తున్నావా?’ అని అడిగారు. అవుననగానే ‘అది అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది. నిజంగా నీ అదృష్టం’ అన్నారు. ఇలాంటి సినిమా తీసేటప్పుడు కష్టాలు కూడా చాలా ఎక్కువగా వుంటాయి. ఈ సినిమాకీ తొలి నుంచీ కష్టాలొచ్చాయి. ఓం రాక్స్టార్లా కష్టపడ్డాడు. ఇరయ్యేళ్ల కాలంలో ఇంత కష్టపడిన దర్శకుడిని మరొకరిని చూడలేదు. చినజీయర్ స్వామి గారికి కృతజ్ఞతలు. ఆయన రాకతో ఈ వేడుకకి మంచి ప్రాధాన్యత వచ్చింది. నిర్మాత భూషణ్కి ఈ సినిమా ఓ భావోద్వేగం. ఏ సినిమాకీ కష్టపడనంత కష్టపడ్డారు. జానకి పాత్రలో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్న ఒక్క పోస్టర్తోనే కృతిసనన్ అందరినీ తనవైపు తిప్పుకుంది. మంచి పేరున్న, మంచి అమ్మాయే కథానాయిక కావాలని తనని ఎంచుకున్నాం. హనుమంతుడు, లక్ష్మణుడి పాత్రలు పోషించిన దేవ్దత్, సన్నీలతో కలిసి నటిస్తున్నప్పుడు తెలియని ఓ కొత్త భావోద్వేగానికి గురయ్యాను’’ అన్నారు ప్రభాస్. అభిమానుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘మామూలుగా కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. ఏడాదిలో మూడు సినిమాలు కూడా రావొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా’’ అన్నారు. పెళ్లి గురించి అభిమానులు ప్రస్తావించగా... ‘‘ఎప్పుడైనా తిరుపతిలోనే చేసుకుంటాలే’’ అంటూ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్వర్మ, ప్రవీణ్ సత్తారు, వివేక్ కూచిభొట్ల, అనిల్ తడానీ, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, అజయ్-అతుల్, శివ్, నీరజ్ కల్యాణ్, శివమ్ చానన, వరుణ్ గుప్తా, సన్నీసింగ్, దేవ్దత్, వంశీ, ప్రమోద్, విక్రమ్, రాహుల్ దూబే, ఇషాంత్, రాజన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?