రివ్యూ చూడగానే కన్నీళ్లు వచ్చాయి: గోపాల్రెడ్డి
తాను చేసిన మొదటి చిత్రం ‘ముద్ద మందారం’ రివ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్రెడ్డి అన్నారు. ఆ రివ్యూలో ‘అన్ని బాగున్నాయి.. ఫొటోగ్రఫీ తప్ప’ అని రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో
ఇంటర్నెట్ డెస్క్: తాను చేసిన మొదటి చిత్రం ‘ముద్ద మందారం’ రివ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్రెడ్డి అన్నారు. ఆ రివ్యూలో ‘అన్ని బాగున్నాయి.. ఫొటోగ్రఫీ తప్ప’ అని రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఎస్.గోపాల్రెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. తన సినిమా ప్రయాణం, పెళ్లి తదితర విషయాలు పంచుకున్నారు. ఇంకా గోపాల్రెడ్డి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
‘‘పని విషయంలో సీరియస్గా ఉండే నేను షూటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం అందరితో మంచి స్నేహితుడిగా ఉంటా. ‘సిరిసిరి మువ్వ’ సినిమా సమయంలో ఓ అమ్మాయిని చూశాను. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆమెకు నా ప్రేమ వ్యక్తపరిచాను. అటు నుంచి కూడా సరే అనడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. అలా ఆయన రాజమండ్రి అల్లుడయ్యాను. మమ్మల్ని కలిపిన సినిమా ‘సిరిసిరి మువ్వ’. ఇప్పుడు వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమాను అప్పట్లోనే నాగార్జునతో ప్లాన్ చేశాం. ‘హలో బ్రదర్’ తర్వాత ఆ సినిమా అనుకున్నాం. అయితే స్క్రిప్టులో మార్చాల్సి వచ్చింది. స్క్రిప్టు మార్చడం ఇష్టం లేకపోవడంతో మార్చే ప్రసక్తే లేదని చెప్పాను. అలా.. ఆ పాన్ ఇండియా ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒక్క రాఘవేంద్రరావు మినహా మిగతా దర్శకులంతా నా కోపానికి గురై నా చేతిలో తిట్లు తిన్నవారే. సినిమా షూటింగ్ సమయంలో చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగేవారు’’ అని గోపాల్ రెడ్డి అన్నారు.
ఎక్కువగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన గోపాల్రెడ్డి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ తన సత్తా నిరూపించుకున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పలు సినిమాలు చేశారాయన. 1990లో వచ్చిన క్షణక్షణం చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘వర్షం’, ‘శ్రీరామదాసు’ చిత్రాలకు ఆయనకు రెండుసార్లు దక్షిణాదిన ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా పురస్కారం లభించింది. 1983లో ఆనంద భైరవి, ఆ తర్వాత క్షణక్షణం, హలో బ్రదర్ చిత్రాలకు ఆయనను నంది అవార్డులు కూడా వరించాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం జూలై 26న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్