Alitho Saradaga: 25 ఏళ్ల తర్వాత.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి

‘ప్రేమఖైదీ’, ‘బంగారు మొగుడు’, ‘భలే మావయ్య’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మాలశ్రీ. కుటుంబ కథా చిత్రాలతో ఒకానొక సమయంలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె ‘సాహసవీరుడ....

Published : 17 Mar 2022 01:23 IST

హైదరాబాద్‌: ‘ప్రేమఖైదీ’, ‘బంగారు మొగుడు’, ‘భలే మావయ్య’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మాలశ్రీ. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె ‘సాహసవీరుడు సాగరకన్య’ తర్వాత తెలుగుతెరకు దూరమయ్యారు. ఇప్పుడు.. 25 సంవత్సరాల తర్వాత ఆమె మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆమె అతిథిగా విచ్చేశారు. తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘సాహసవీరుడు సాగరకన్య’ తర్వాత నాకు వివాహమైంది. అదే సమయంలో కన్నడలో ఫుల్‌ బిజీ అయిపోయాను. అక్కడ వరుసగా యాక్షన్‌ సినిమాలు చేసి యాక్షన్‌ హీరోలా అయిపోయా. అలా తెలుగు తెరకు కాస్త దూరంగా ఉన్నా’’ అని మాలశ్రీ తెలిపారు. అనంతరం ‘ప్రేమఖైదీ’ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ సినిమా 100వ రోజు నాడు.. సినిమాలో పనిచేసిన హీరోహీరోయిన్లకి రామానాయుడు ఖరీదైన వాహనాలను గిఫ్ట్‌గా పంపించారు’’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని