Vijay Bulganin: కమెడియన్ల చిత్రాలకు సంగీతమందిస్తానని నాపై ముద్ర వేశారు!
ఇటీవల కాలంలో విడుదలకు ముందే పాటలతో సినీప్రియుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బేబి’.
ఇటీవల కాలంలో విడుదలకు ముందే పాటలతో సినీప్రియుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బేబి’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శనివారం విలేకర్లతో ముచ్చటించారు సంగీత దర్శకుడు విజయ్. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత ప్రయాణ విశేషాల్ని పంచుకున్నారు.
‘‘ఈ చిత్రానికి తొలి హీరో నేనని అందరూ ప్రశంసిస్తున్నారు. నిజానికి నేను కాదు. సాయి రాజేష్ అడగకపోతే నేనింత మంచి సంగీతం ఇచ్చే వాడిని కాదేమో. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ ఆయనదే. ఈ కథ విన్నాక నేను ముందుగా దీంట్లో కష్టంగా ఉన్న పాట చేయాలనుకున్నా. ప్రీక్లైమాక్స్కు ముందొచ్చే ‘ప్రేమిస్తున్నా’ పాట చేయమన్నారు రాజేష్. దాన్ని రెండు మూడు రోజుల్లోనే చేసిచ్చా. అలాగే ‘‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’’ పాటను కూడా చాలా వేగంగానే పూర్తి చేసిచ్చా. నిజానికి ఈ చిత్ర పాటల్ని సిద్ధం చేయడానికి నాకు పెద్దగా టైమ్ పట్టలేదు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు, నాని పంపిన సందేశం నాకెంతో ప్రత్యేకం. నిజానికి నా గత చిత్రాలకు కూడా నా బెస్ట్ ఇచ్చాను. కానీ, ఈ చిత్రం పెద్ద హిట్టవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది’’.
మంచి పాట ఎప్పటికీ ఆగిపోదు..
‘‘సంగీత దర్శకుడిగా నా తొలి సినిమా ‘వారధి’. తర్వాత సప్తగిరి హీరోగా చేసిన ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’, ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ తదితర చిత్రాలకు సంగీతమందించా. ఆ సమయంలో కమెడియన్ సినిమాలకు మ్యూజిక్ చేస్తాడంటూ నాపై ఓ ముద్ర వేశారు. దీంతో సరిగ్గా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్పై దృష్టి పెట్టి.. సొంతంగా పాటలు చేశా. వాటి ద్వారా మళ్లీ అవకాశాలొచ్చాయి. నేను నమ్మేది ఒకటే.. మంచి పాట అనుకున్నది ఎప్పటికీ ఆగిపోదు. అదెప్పటికైనా ప్రజల మనసుల్లోకి వెళ్తుంది. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్ చేయగలమనేది నా నమ్మకం. మాస్ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’