Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది.

Published : 06 May 2024 09:34 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.2,391.98 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.690.52 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని