Baby: నవ్విస్తుంది.. షాకిస్తుంది
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మాత.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబి’ (Baby). ఎస్కేఎన్ నిర్మాత. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతి హైదరాబాద్లో శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు ఒకెత్తు.. ఈ ‘బేబి’ మరొకెత్తు. ఈ కథను సాయి రాజేష్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూశా. ఇంత అద్భుతమైన చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదనిపించింది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మారుతి. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో గుర్తుండిపోయే సంభాషణలు, భావోద్వేగాలు, పాటలు.. అన్నీ ఉన్నాయి. నేనే కాదు.. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. నాలోని నటుడ్ని గుర్తించింది నిర్మాత ఎస్కేఎన్. సాయి రాజేష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది. షాక్కు గురి చేస్తుంది.. సర్ప్రైజ్ చేస్తుంది. ప్రతి ఒక్కరి మదిలో పదిలంగా గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్లో చూసింది కొంచెమే. సినిమాలో చాలా ఇంటెన్స్ సీన్లు ఉన్నాయి. ఇందులోని ప్రతి పాత్రతోనూ బలంగా కనెక్ట్ అవుతారు. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంద’’న్నారు మరో హీరో విరాజ్. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చాలా ఎమోషన్ ఉంది. ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈతరం కుర్రాళ్ల కోసం తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మేము ఓ మంచి సినిమా తీశామని గర్వంగా ఉంద’’న్నారు దర్శకుడు సాయి రాజేష్. ఈ కార్యక్రమంలో వైష్ణవి, బన్నీ వాసు, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’