Barhma anandham: తండ్రీతనయులు తాత మనవళ్లుగా...

నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు.

Updated : 09 May 2024 10:09 IST

నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే రూపొందనున్న ఆ సినిమాని స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఓ వీడియోతో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించే ఈ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 6న విడుదల  చేయనున్నారు. ఇందులో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఛాయాగ్రహణం: మితేశ్‌ పర్వతనేని, సంగీతం: శాండిల్య పీసపాటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని