Suryadevara Naga Vamsi: నా దృష్టిలో ఇదీ ఓ ప్రయోగమే
‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన. ‘డీజే టిల్లు’ తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా ‘స్వాతిముత్యం’ అంటున్నారు.
‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi). సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన. ‘డీజే టిల్లు’ (DJ Tillu) తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) అంటున్నారు. ఆయన నిర్మాణంలో గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగవంశీ హైదరా బాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ప్రతీ శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సహజంగా మారింది. ఇక పండగల సమయంలో మూడు సినిమాలొచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. ఆ నమ్మకంతోనే సినిమాని దసరాకి విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్కి వస్తే తప్పకుండా నవ్వుకుని బయటికి వస్తారు. అలాగని కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా కాదు. వీర్యదానం అనే అంశం చుట్టూ ఈ కథ సాగినా అది ఎవ్వరికీ ఇబ్బందికరం కాని రీతిలో ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. కథతోపాటే గణేశ్ వచ్చారు. ఒక అమాయకుడి చుట్టూ సాగే ఈ కథకి తను బాగా నప్పాడు. వర్ష బొల్లమ్మ ఒక చిన్న టౌన్కి చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. ‘మిడిల్క్లాస్ మెలోడీస్’లో ఆమె నటనని చూసి ఎంపిక చేశాం. లక్ష్మణ్ చాలా నమ్మకంగా అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు ఇచ్చాం అంతే’’.
* ‘‘మేం తీసిన ‘డీజే టిల్లు’ తర్వాత అన్నీ భారీ సినిమాలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మొన్న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’... ఇలా వేటికవే భిన్నమైన సినిమాలు. వినోదాత్మక చిత్రాలు పెద్దగా రాలేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఉంటుందీ చిత్రం. నా దృష్టిలో ఇది కూడా ఓ ప్రయోగమే. ‘డీజే టిల్లు’ మొదులకొని ‘వరుడు కావలెను’, ‘స్వాతిముత్యం’ ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. తదుపరి వరుసగా వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నాం. బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్తేజ్, నవీన్ పోలిశెట్టిలతో సినిమాలు చేస్తున్నాం. కళాశాల నేపథ్యంలో సాగే ఓ కథతో ఎన్టీఆర్ బావమరిది నితిన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాం. ‘డీజే టిల్లు2’ చిత్రీకరణ మొదలైంది. ఇందులో నాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది’’.
* ‘‘మా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న మహేష్బాబు చిత్రం అంచనాలకి దీటుగా ఉంటుంది. మహేష్బాబు ఇప్పటివరకు చేయని పాత్రని ఇందులో చేస్తున్నారు. మహేష్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో అంతగా ఆదరణ పొందలేదు. కానీ టీవీల్లో ఆ సినిమాల్ని చూసి ఈ కలయికపై ప్రత్యేకమైన అంచనాల్ని పెంచుకున్నారు. ఏ స్థాయిలో అంచనాలు పెంచుకుని వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఉంటుంది చిత్రం. ఇందులో మాస్ని మెప్పించేలా ఓ ప్రత్యేక గీతం కోసం దర్శకుడిని అభ్యర్థించాం. ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న