Suryadevara Naga Vamsi: నా దృష్టిలో ఇదీ ఓ ప్రయోగమే
‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన. ‘డీజే టిల్లు’ తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా ‘స్వాతిముత్యం’ అంటున్నారు.
‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన కథల్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi). సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాత ఆయన. ‘డీజే టిల్లు’ (DJ Tillu) తర్వాత మళ్లీ అంతగా నవ్వించిన సినిమా రాలేదనీ, అలా ఇంటిల్లిపాదీ కలిసి నవ్వుకునేలా మేం తీసిన మరో కుటుంబ కథా చిత్రమే మా ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) అంటున్నారు. ఆయన నిర్మాణంలో గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగవంశీ హైదరా బాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ప్రతీ శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సహజంగా మారింది. ఇక పండగల సమయంలో మూడు సినిమాలొచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. ఆ నమ్మకంతోనే సినిమాని దసరాకి విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్కి వస్తే తప్పకుండా నవ్వుకుని బయటికి వస్తారు. అలాగని కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా కాదు. వీర్యదానం అనే అంశం చుట్టూ ఈ కథ సాగినా అది ఎవ్వరికీ ఇబ్బందికరం కాని రీతిలో ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. కథతోపాటే గణేశ్ వచ్చారు. ఒక అమాయకుడి చుట్టూ సాగే ఈ కథకి తను బాగా నప్పాడు. వర్ష బొల్లమ్మ ఒక చిన్న టౌన్కి చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. ‘మిడిల్క్లాస్ మెలోడీస్’లో ఆమె నటనని చూసి ఎంపిక చేశాం. లక్ష్మణ్ చాలా నమ్మకంగా అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు ఇచ్చాం అంతే’’.
* ‘‘మేం తీసిన ‘డీజే టిల్లు’ తర్వాత అన్నీ భారీ సినిమాలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మొన్న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’... ఇలా వేటికవే భిన్నమైన సినిమాలు. వినోదాత్మక చిత్రాలు పెద్దగా రాలేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఉంటుందీ చిత్రం. నా దృష్టిలో ఇది కూడా ఓ ప్రయోగమే. ‘డీజే టిల్లు’ మొదులకొని ‘వరుడు కావలెను’, ‘స్వాతిముత్యం’ ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. తదుపరి వరుసగా వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నాం. బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్తేజ్, నవీన్ పోలిశెట్టిలతో సినిమాలు చేస్తున్నాం. కళాశాల నేపథ్యంలో సాగే ఓ కథతో ఎన్టీఆర్ బావమరిది నితిన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాం. ‘డీజే టిల్లు2’ చిత్రీకరణ మొదలైంది. ఇందులో నాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది’’.
* ‘‘మా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న మహేష్బాబు చిత్రం అంచనాలకి దీటుగా ఉంటుంది. మహేష్బాబు ఇప్పటివరకు చేయని పాత్రని ఇందులో చేస్తున్నారు. మహేష్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో అంతగా ఆదరణ పొందలేదు. కానీ టీవీల్లో ఆ సినిమాల్ని చూసి ఈ కలయికపై ప్రత్యేకమైన అంచనాల్ని పెంచుకున్నారు. ఏ స్థాయిలో అంచనాలు పెంచుకుని వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఉంటుంది చిత్రం. ఇందులో మాస్ని మెప్పించేలా ఓ ప్రత్యేక గీతం కోసం దర్శకుడిని అభ్యర్థించాం. ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!