Sankranthi Movies 2024: సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు
రవితేజ కథా నాయకుడిగా నటించిన ‘ఈగల్’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న ఆ సినిమాని సోలోగా విడుదల చేయడానికి సహకరించాలనే ఒప్పందంపై నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘ఈగల్’ ఫిబ్రవరి 9కి వాయిదా
పోటీలేని విడుదలకి సహకరించాలని ఛాంబర్ నిర్ణయం
రవితేజ కథా నాయకుడిగా నటించిన ‘ఈగల్’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న ఆ సినిమాని సోలోగా విడుదల చేయడానికి సహకరించాలనే ఒప్పందంపై నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచినట్టైంది. ఈ నిర్ణయం పరిశ్రమకి మేలు చేస్తుందని సినీ పెద్దలు చెప్పారు. ‘గుంటూరు కారం’, ‘హను-మాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’తోపాటు ‘ఈగల్’ చిత్రాలు ఈసారి సంక్రాంతి సందర్భంగా విడుదల తేదీల్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే దేనికీ తగినన్ని థియేటర్లు దొరకవనీ... ఆ ప్రభావం వసూళ్లపై బలంగా ఉంటుందనే ఆందోళన వ్యాపారవర్గాల్లో వ్యక్తమైంది. దీనిపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కలిసి ఆయా నిర్మాతలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గేలా కనిపించలేదు. దాంతో పోటీలో ఐదు సినిమాలు ఖాయం అనుకున్నారంతా. చివరిగా మరోమారు జరిపిన చర్చల్లో ‘ఈగల్’ వాయిదాకి నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, కథానాయకుడు రవితేజ అంగీకారం తెలిపారు. దాంతో పరిశ్రమకి చెందిన సంస్థలు, ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్రాజు మాట్లాడుతూ ‘‘గత ఆరు నెలలుగా ఎవరికి వారు విడుదల తేదీల్ని ప్రకటిస్తూ వచ్చాం. మా ‘ఫ్యామిలీస్టార్’ చిత్రం వాయిదా పడ్డాక... ఐదు సినిమాలు బరిలో నిలిచాయి. దాంతో నిర్మాతల్ని సమావేశ పరిచి ఎవరికి వీలున్నా వాయిదాకి ప్రయత్నించండని కోరాం. మూడు రోజులుగా జరుపుతున్న చర్చలతో టి.జి.విశ్వప్రసాద్ తన ‘ఈగల్’ వాయిదాకి అంగీకారం తెలిపారు. వాణిజ్య మండలి నుంచి ఆ సినిమాకి పోటీలేని విడుదలకి సహకారం అందించాలని నిర్ణయించాం. అందుకు ఒప్పుకున్న కథానాయకుడు రవితేజ, నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్లకి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి దామోదర్ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అనుపమ్ రెడ్డి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, వెంకట్ బోయనపల్లి, సునీల్ నారంగ్, శ్రీనివాసా చిట్టూరి, కె.నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!