Manchu Vishnu: తెలుగు సినిమా 90ఏళ్ల వేడుకలు మలేసియాలో
తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఘన కీర్తిని చాటి చెప్పేందుకు ‘నవతిహి’ పేరుతో వేడుకలు నిర్వహించనుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా). ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రకటించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఘన కీర్తిని చాటి చెప్పేందుకు ‘నవతిహి’ పేరుతో వేడుకలు నిర్వహించనుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా). ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా 90ఏళ్ల చరిత్రను ‘నవతిహి ఉత్సవం’ పేరిట ‘మా’ తరఫున ఘనంగా నిర్వహించనున్నాం. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జులై నెలలో ఈ వేడుకలు నిర్వహించనున్నాం. సినీ పెద్దలతో చర్చించి.. వారి ఆశీసులతో వేడుకలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తాం. ఈ మేరకు జులైలో చిత్రీకరణలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్రాజును కోరాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేసి, ఆ మొత్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల కోసం ఉపయోగించనున్నాం. ‘మా’ ప్రస్తుతం దేశంలోని ఐదు అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంది. ఈ వేడుకలకు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా కొందరు రానున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గర్వించాల్సిన విషయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివ బాలాజీ, పలువురు మలేసియా ప్రతినిధులు పాల్గొన్నారు.
‘మా’ భవనంపై ఎన్నికల తర్వాత ప్రకటన
ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘మా’ భవనంకు సంబంధించి ఓ మంచి ప్రకటన రానుందన్నారు మంచు విష్ణు. ‘మా’ కార్యాలయం ఎక్కడ ఉండాలనే విషయంలో జనరల్ బాడీ సమావేశంలో చర్చించామని.. ‘మా’ సభ్యులంతా కొత్తగా నిర్మించనున్న ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలోనే దాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజుతో పాటు పలువురు సినీ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. వాళ్ల నిర్ణయం ఆధారంగా త్వరలో తాము ‘మా’ భవనంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే ఇక ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టత ఇచ్చారు విష్ణు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్