ఎస్పీ బాలు పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌?

‘మిథునం’ బాలీవుడ్‌కి వెళ్తోందా... అందులో అమితాబ్‌, రేఖ నటిస్తారా?

Published : 28 Nov 2020 00:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాలో ఆణిముత్యాలు అని కొన్ని ఏరితే... అందులో మిలమిలా మెరిసిపోయే కొన్నింటిలో ‘మిథునం’ ఒకటి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లో ట్రెండ్‌ సెట్టర్‌ అనే చెప్పొచ్చు. రెండే పాత్రలతో తనికెళ్ల భరణి తెరకెక్కించిన విధానం... ఎస్పీబీ, లక్ష్మీ నటన సినిమాకు ఊపిరి పోశాయి. అంతేకాదు ఈ సినిమాకు భాష ప్రధానం కాదు అని కూడా రుజువు చేశారు. అందుకేనేమో ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా... ఇంకా ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. 

‘మిథునం’ను బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముంబయికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిందని భోగట్టా. అంతేకాదు ఇందులో అమితాబ్‌, రేఖ నటిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి గానీ, నటీనటుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం వెలువడలేదు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్‌ కుదిరితే అభిమానులకు పండుగనే చెపపాలి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ జంట జోడీ కడుతుంటే.. వారిని డైరెక్ట్‌ చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని