Tollywood: ‘డీజే టిల్లు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ‘లైగర్‌’ షూట్‌ అప్‌డేట్‌

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన  చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మతోని అనేది ఉపశీర్షిక. నేహాశెట్టి కథానాయిక.

Published : 04 Feb 2022 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. నేహాశెట్టి కథానాయిక. విమల్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమాని ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాయకానాయికలు రొమాంటిక్‌గా కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి తమన్‌ నేపథ్య సంగీతం అందించారు.

ముంబయిలో లైగర్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం.. ముంబయిలో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ సాగుతోంది. ఈ షూట్‌లో విజయ్‌తోపాటు కీలక పాత్రధారులంతా పాల్గొన్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: విష్ణుశర్మ, కూర్పు: జునైద్‌ సిద్ధిఖి, కళ: జానీ షేక్‌ బాషా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని