మోసగాళ్లు నుంచి మరో సింగిల్‌

మంచువిష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం...

Published : 20 Feb 2021 00:31 IST

హైదరాబాద్‌: మంచువిష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పాటను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘పైసా మే హై పరమాత్మ’ అంటూ సాగే ఈ పాట తనకెంతో ఇష్టమని విష్ణు పేర్కొన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, నవ్‌దీప్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని