
Sirivennela: ‘శ్యామ్ సింగరాయ్’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!
ఇంటర్నెట్ డెస్క్: సాహిత్య, సంగీత అభిమానులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పాటల రూపంలో చూసుకుంటున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సిరివెన్నెలను స్మరించుకుంటున్నారు. ‘సిరివెన్నెల’ చిత్రంతో ఆయన సినీ పాటల ప్రయాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో ఒకటి మంగళవారం విడుదలైంది. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ఈ గీతం ‘సిరివెన్నెల’ అంటూ సాగడం విశేషం. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.