నితిన్‌ ఉంగరం తొడిగేశాడు 

యువ కథానాయకుడు నితిన్, శాలినిల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోను నితిన్‌ ట్వీట్‌ చేశారు

Updated : 22 Jul 2020 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నితిన్, శాలినిల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోను నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 26న జరిగే వివాహ వేడుకతో ఈ ప్రేమజంట ఒకటి కానుంది. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో వేడుక నిర్వహించనున్నారు. 26న రాత్రి 8.30 గంటలకు ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లి జరగుతుంది. దీనికి సంబంధించి నితిన్‌ కుటుంబం ఇప్పటికే అతిథులకు శుభలేఖలు అందించింది. వీరి పెళ్లి ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు.

నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు.  ప్రస్తుతం ‘రంగ్‌ దే’, ‘అంధాదున్‌‌’ రీమేక్‌తో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని