Puri Musings: అలా అయితే నువ్వు రజనీ అవుతావు
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరిట పలు అంశాల గురించి తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రాక్టీస్ గురించి పూరి ఏమన్నారంటే
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరిట పలు అంశాల గురించి తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాక్టీస్ గురించి వివరించారు. ఏదైనా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిత్య సాధన మరవకూడదని గుర్తుచేశారు. మరిన్ని ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే...
‘‘బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు 10,000 కిక్స్ తెలిసిన వాడంటే భయం లేదు. కానీ ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో చాలా జాగ్రత్తగా ఉంటానని. ఎందుకంటే ఆ కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడు కొడితే మన కాలు విరిగిపోద్ది. అందుకే మనకు ఏ పని తెలిస్తే, అందులో మాస్టర్ అయిపోవాలి. అందుకు ప్రాక్టీస్ చేయాలి. దీన్నే సాధన అంటారు. నువ్వు ఎంత పెద్ద సింగర్వి అయినా రోజూ ప్రాక్టీస్ చేయ్. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని నెమరువేసుకో. కొండెక్కి అరువు.. గొంతు చించుకో. నువ్వు బాక్సర్ అయితే రోజూ కిక్ బ్యాగ్ని కొట్టు. నీకు బోలెడు నాలెడ్జ్ ఉండొచ్చు. ప్రాక్టీస్లో పెట్టకపోతే అది ఎందుకూ పనికిరాదు’’
‘‘ఒక ఆర్ట్ నీకు పూర్తిగా తెలిసి ఉండొచ్చు. శాస్త్రం మొత్తం నువ్వు చదివేసి ఉండొచ్చు. నాకు అన్నీ తెలుసులే అని కూర్చుంటే చెంప పగులుద్ది. కుంగ్ ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేకపోతే కుమ్మేస్తారు. అమితాబ్ బచ్చన్ గారితో నేను పనిచేశా. గ్రేట్ యాక్టర్. అయినా సరే రోజూ షూటింగ్ అయిపోగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి స్వయంగా తనే వెళ్లి మరుసటి రోజు సీన్ పేపర్ తీసుకుంటారు. ఉదయం లేవగానే ఆయన అద్దం ముందు నిలబడి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు. మళ్లీ షూటింగ్లో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అదే సీన్ పేపర్ ఇచ్చి చదవమంటారు. తన ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకుంటారు. ఆ సీన్లో తనతోపాటు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుని, అవతలి వాళ్లు చిన్న యాక్టర్ అయినా సరే వాళ్ల దగ్గరకి వెళ్లి సీన్ ప్రాక్టీస్ చేద్దామా.. అని అడిగి వాళ్లతో కలిసి డైలాగ్ని మరోసారి ప్రాక్టీస్ చేస్తారు. అవతలి వారు డైలాగ్ ఎలా చెప్తున్నారో చూస్తారు. ఎదుటివారు ఎలా చెప్తే ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారాయన. మామూలుగా ఏ యాక్టర్ అయినా తమ డైలాగ్ని చదువుకుని.. కారావ్యాన్లో వెయిట్ చేస్తారు షాట్ కోసం. అమితాబ్ గారు అలా కాదు.. అందుకే ఆయన అమితాబ్ బచ్చన్ అయ్యారు. ఆయనతో పోలిస్తే మనం ఎంత? అందుకే ప్రాక్టీస్ చేయండి. పనిలో ఉన్నా.. పనిలేకుండా ఖాళీగా ఉన్నా.. ఏది తెలిస్తే దాన్ని సాధన చేయండి. సిగరెట్ విసిరితే కరెక్టుగా నోట్లో పడాలి. పడితే నువ్వు రజనీకాంత్ అవుతావు’’ అని పూరి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?