బాలీవుడ్‌ నటుడి పార్టీ.. ఒకేచోట కలిసిన అలనాటి తారలు.. ఫొటోలు వైరల్‌

దక్షిణాది, బాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి నటీనటులందరూ ఒకేచోట కలిశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా సమయాన్ని గడిపారు. 

Published : 13 Nov 2022 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 80ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిశారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. గేమ్స్ ఆడుతూ‌, డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ విందు, వినోద కార్యక్రమాలకు బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యం అందించారు.

అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుకలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 11వ రీయూనియన్‌ వేడుకకు నటుడు జాకీ ష్రాఫ్‌, నటి పూనమ్‌ ధిల్లాన్‌ ఆతిథ్యమిచ్చారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి, వెంకటేశ్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అనిల్‌ కపూర్‌, అర్జున్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2020లో జరిగిన 10వ రీయూనియన్‌ సెలబ్రేషన్స్‌కు మెగాస్టార్‌ నివాసం వేదికైన విషయం తెలిసిందే. ఆనాటి వేడుకల్లో సుహాసిని, రాధ, జయప్రద, జయసుధ, ఖుష్బూలతో చిరు స్టెప్పులేసి అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని