Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే!

సాయి ధరమ్‌తేజ్‌కు వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోందని, శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు వివరించారు

Updated : 16 Sep 2021 21:54 IST

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోందని, శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని వివరించారు. ఈరోజు చేసిన పరీక్షల నివేదికలన్నీ సానుకూలంగా వచ్చినట్లు తెలిపారు.

శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని