Tollywood: ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు.
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. భారీ బడ్జెట్తో రూపొందించినా.. సినీప్రియుల్ని ఆకట్టుకునే కథలు, పాత్రలు లేకపోవడం వల్ల హిందీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతున్నాయని అంటున్నాయి చిత్రవర్గాలు. ఇటీవలే విడుదలైన అక్షయ్ కుమార్ నటించిన ‘బడేమియా ఛోటేమియా’, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ లాంటి చిత్రాల్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించినా.. బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే తాజాగా ప్రేక్షకుల్ని మెప్పించే ఆసక్తికర సినిమాలు రాకపోవడం వల్ల కొన్ని మల్టీఫ్లెక్స్లలోని ప్రదర్శనలను, సింగిల్ స్క్రీన్ థియేటర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఈ విషయాన్ని ముంబయికి చెందిన జీ7 మల్టీప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ ఓ ఆంగ్ల మీడియాకు తెలిపారు. ‘‘కేవలం ఎన్నికలను, సమ్మర్ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు సినిమాలను తీయడం లేదు దర్శకులు. దీని వల్ల సినిమాలపై వారికి ఆసక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు హిందీ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించక బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని అందుకునేవి. కానీ.. ఎప్పుడైతే దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి బాలీవుడ్ పరిస్థితి కొంచెం మెరుగుపడిందనుకోవచ్చు. కానీ ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమ మీద ఆధార పడకుండా సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే