Bigg boss Telugu 5: బిగ్బాస్లో అంకుల్స్ వెళ్లిపోవాలి.. గేమ్ ఈ రోజుతో అయిపోయేది కాదు!
బిగ్బాస్ హౌస్లో కొత్త కెప్టెన్ను ఎన్నుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఈ వారం ఇంటి సభ్యులకు ‘అభయహస్తం’ టాస్క్ ఇస్తున్నట్లు....
హైదరాబాద్: ఈరోజు హౌస్మేట్స్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘నేనూ మానస్ టాప్-5 దాకా ఉంటాం’ అని పింకీ అంటే ‘మరి మేమేంటి అడుక్కు తినాలా’ అంటూ సిరి సమాధానం ఇచ్చింది. ఇక ‘అంకుల్స్ అందరూ వెళ్లిపోవాలి. కుర్రాళ్లు ఉండిపోవాలి’ అని మానస్ అంటే ‘ఆంటీలు వెళ్లిపోవాల్సి వస్తే ప్రియాంక కూడా వెళ్లిపోతుంది’ అంటూ సిరి ఆటపట్టించింది. ‘వేర్ ఈజ్ షన్ను అంటే, మోజ్ రూమ్ విత్ త్రీ, ఆన్ బెడ్ విత్ త్రీ ఇదే నాకు కనిపించింది’ అని షణ్ముఖ్కు రవి గీతోపదేశం చేశాడు. శ్రీరామ్ శకునిలా మాట్లాడుతూ.. రవిని ఉద్దేశించి ‘దుర్యోధన’ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇక హౌస్మేట్స్ను మానస్, సన్నీ, రవిలు అనుకరించిన విధానం కితకితలు పెడుతోంది.
ఆ తర్వాత బిగ్బాస్ హౌస్లో కొత్త కెప్టెన్ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఈ వారం ఇంటి సభ్యులకు ‘అభయహస్తం’ టాస్క్ ఇస్తున్నట్లు బిగ్బాస్ సూచించాడు. టాస్క్లో భాగంగా హౌస్ని పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. టాస్క్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకు కెప్టెన్సీ పోటీలోకి ఎంట్రీతో పాటు ఇంటిలోపలికి వెళ్లే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు తెలిపాడు. దీంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం ‘అభయహస్తం’ టాస్క్లో షణ్ముఖ్ - లోబో హోరాహోరీగా తలపడ్డారు. బురదతో నిండిన బాత్టబ్ నుంచి కాయిన్స్, బాల్స్ని సేకరించారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ - విశ్వ, కాజల్ - లోబోల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ‘‘నా ఇష్టం నేను మాట్లాడతా. నీకు ఇబ్బంది ఉంటే చెవులు మూసుకో’’.. అంటూ లోబోపై కాజల్ ఫైర్ అయ్యారు. ‘అభయహస్తం’ టాస్క్లో బిగ్బాస్ పెట్టిన కండిషన్స్ ఏమిటి? కాజల్ - లోబోల మధ్య వాగ్వాదానికి కారణమేమిటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.