Cinema News: ప్రపంచంలో అసలైన మనుషులు ఇద్దరే ఇద్దరు!

‘మరో ప్రస్థానం’ ట్రైలర్‌ విడుదలైంది. తనీశ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

Published : 16 Sep 2021 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తనీశ్‌, ముస్కాన్‌ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. జానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. విలన్‌ బృందం వరుస హత్యలు చేస్తుంటుంది. హీరో బృందం వాటిని చిత్రీకరించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. హత్యల్ని షూట్‌ చేసిన కెమెరా విలన్లకి దొరుకుతుంది. దాంతో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి.

‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్‌ పాత్ర చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది’ అంటూ తనీశ్‌ తన పాత్రని వివరించిన తీరు బాగుంది. ‘అతి చిన్న కెమెరాతో సింగిల్‌ షాట్‌లో తెరకెక్కించిన తొలి సినిమా ఇదే’ అని చిత్రబృందం తెలిపింది. ఓంకారేశ్వర క్రియేషన్స్‌, మిత్ర మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని