cinema news: తండ్రీ కొడుకుల అనుబంధాలకు ‘పోస్టర్‌’

విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘పోస్టర్‌’. టి.మహిపాల్‌ రెడ్డి దర్శకుడు.

Updated : 17 Nov 2021 07:18 IST


విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘పోస్టర్‌’. టి.మహిపాల్‌ రెడ్డి దర్శకుడు. టి.శేఖర్‌ రెడ్డి,   ఎ.గంగారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకాష్‌ పూరి మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌ చాలా బాగుంది. ట్రైలర్‌, పాటలు చూశాక సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగింది. సంగీతం, విజువల్స్‌ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉన్న కథతో ఈ సినిమా రూపొందించాం.  ఇంత మంచి కథ నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు హీరో విజయ్‌ ధరన్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రతి తండ్రీ తన కొడుకు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ ఇది. ఇందులో ఓ అందమైన ప్రేమకథా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శాండీ, టి.శేఖర్‌, నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని