Asalem Jarigindi: ఊహించని విజయమిది
‘‘కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి దొరుకుతుంది. అలాంటి సంతృప్తిని మాకు అందించిన చిత్రమిది’’ అన్నారు శ్రీరామ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మాతలు
‘‘కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి దొరుకుతుంది. అలాంటి సంతృప్తిని మాకు అందించిన చిత్రమిది’’ అన్నారు శ్రీరామ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మాతలు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్లో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘సహాయ పాత్రలకి దూరంగా ఉంటూ, సోలో హీరోగా నటించాలని చూస్తున్న సమయంలో ఈ దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. వాళ్లు చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. కింగ్ జాన్సన్లాంటి నిర్మాతలు పరిశ్రమలోకి రావాలి. అప్పుడే ప్రతిభావంతులకి అవకాశాలు దొరుకుతాయి’’ అన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ ‘‘ఊహించని విజయాన్ని అందించిన చిత్రమిది. కాన్సెప్ట్ ప్రధానంగా ఓ మంచి కథాంశంతో తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయవంతం అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి కథానాయకుడు శ్రీరామ్’’ అన్నారు దర్శకుడు. నటుడు రవికుమార్, రచయిత వాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..