Vishal: ‘లాఠీ’తో వస్తున్నాడు

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సనయన కథా  నాయిక. ఈ సినిమాకి ‘లాఠీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు

Updated : 18 Oct 2021 06:56 IST

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సనయన కథా  నాయిక. ఈ సినిమాకి ‘లాఠీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. టెర్రస్‌పైన ఉన్న ఓ షర్ట్‌ పోలీస్‌ యూనిఫాంలా మారడం.. దానిపై విశాల్‌ పాత్ర పేరు ఉండటం.. అక్కడే ఉన్న ఓ కర్ర లాఠీగా మారడం వంటి సన్నివేశాలతో ఆ వీడియో ఆసక్తికరంగా సాగింది. దీన్ని బట్టి ఈ సినిమాలో ఆయన ఓ శక్తిమంతమైన పోలీస్‌గా కనిపించనున్నట్లు అర్థమైంది. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ పోరాట ఘట్టాలకు దిలీప్‌ సుబ్బరాయణ్‌ నేతృత్వం వహించారు. మరి విశాల్‌ తన లాఠీతో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సిఎస్‌, ఛాయాగ్రహణం: బాలసుబ్రమణ్యన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని