పర్యాటక వీసా.. విసిగి వేసారేలా
.. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి శాంతించింది.. విదేశాలు ఆంక్షలు సడలించాయి.. విమానాలు అన్ని దేశాలనూ చుట్టివస్తున్నాయి.. రెండున్నరేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లలేని వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ అందాలు చూసొద్దాం..
యూరప్ దేశాలకు వెళ్లాలంటే 2 నెలలపాటు తప్పని ఎదురుచూపులు
గణనీయంగా పెరిగిన విమాన ఛార్జీలు, హోటళ్ల అద్దె
దేశీయ పర్యాటకం వైపు దృష్టి
ఈనాడు, హైదరాబాద్
* హైదరాబాద్ వాసి రవీంద్రనాథ్ విహారయాత్రకు కుటుంబంతో పాటు గ్రీస్ వెళ్లాలనుకున్నాడు. పర్యాటక వీసా కోసం ప్రయత్నిస్తే నెల, నెలన్నర సమయం పడుతుందన్నారు. ఆయన యాత్రను రద్దు చేసుకున్నారు.
* కాంచనలక్ష్మి కుటుంబం అప్పుడప్పుడు సరదాగా సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి వస్తుంటుంది. ఈసారి థాయ్లాండ్ వెళ్లాలనుకుంది. విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు ఎక్కువగా ఉండటంతో బడ్జెట్ భారీగా అవుతోంది. టూర్ ఆపరేటర్ను అడిగితే రెండు, మూడు నెలల తర్వాత ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చాడు.
.. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి శాంతించింది.. విదేశాలు ఆంక్షలు సడలించాయి.. విమానాలు అన్ని దేశాలనూ చుట్టివస్తున్నాయి.. రెండున్నరేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లలేని వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ అందాలు చూసొద్దాం.. అంటూ పర్యాటకులు సిద్ధం అవుతున్నారు. ఏ నెలలో వెళ్లాలి.. ఏయే దేశాలు చూసిరావాలి.. బడ్జెట్ ఎంతవుతుంది.. ఇలా లెక్కలేసుకుని పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక షాక్ తగులుతోంది. గతంలో ఏ దేశానికైనా ఒకట్రెండు వారాల్లో పర్యాటక వీసా దొరికేది. కానీ, ఇప్పుడు యూరప్ దేశాలకు వెళ్లాలంటే కనీసం నెల, రెండు నెలలు ఆగాల్సివస్తోంది. అమెరికాకు గరిష్ఠంగా 500, న్యూజిలాండ్కు 200 రోజులు పడుతోంది. ఫలితంగా సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, వియత్నాం వైపు చూస్తున్నారు. అమెరికా, యూరప్లకు వెళ్లాలనుకునేవారు ప్రస్తుతానికి ఉత్తర, ఈశాన్య భారత్లోని పర్యాటక ప్రాంతాల వైపు దృష్టిసారిస్తున్నారు.
విమానఛార్జీలు డబుల్!
విదేశాలతో పాటు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విమాన టికెట్ల ధరలు కొవిడ్ ముందుకంటే రెట్టింపు అయ్యాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. హోటళ్లలో గదుల అద్దెలూ పెరిగాయి. కొవిడ్ సమయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడం ఒక కారణం అయితే.. పర్యాటకుల తాకిడి హఠాత్తుగా పెరగడమూ మరో కారణమని అంటున్నారు. బ్యాంకాక్కు గతంలో రానుపోను విమాన టికెట్లు 18-20వేలకు దొరికేవి. ఇప్పుడు 40వేల వరకు ఖర్చవుతోంది. సిక్కింకు విమాన టికెట్ రూ.4వేలకు దొరికేది. అదీ రెట్టింపైంది.
భారత్లో పర్వత పర్యాటక ప్రాంతాలకు
- కె.రంగారెడ్డి, తెలుగు రాష్ట్రాల ఛైర్మన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్
తొలిసారి పర్యాటక వీసాతో అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేవారికి వీసా అపాయింట్మెంట్ దొరకడానికి చాలా సమయం పడుతోంది. అలాంటివాళ్లు దేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్, సిక్కిం రాష్ట్రాల్లోని పర్వత పర్యాటక ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఆస్ట్రేలియా, జపాన్, థాయ్లాండ్, శ్రీలంక వంటి దేశాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు.
వియత్నాం.. సరికొత్త ఆకర్షణ
- ఎన్.ఎస్.ఎన్.మోహన్, అధ్యక్షుడు-స్కాల్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
కొవిడ్తో ఇన్నాళ్లూ పర్యాటకుల్ని అనుమతించని దేశాలు ఇప్పుడు వారిని స్వాగతిస్తుండటంతో ఔత్సాహికులు ఒక్కసారిగా ముందుకొస్తున్నారు. ఫలితంగా పర్యాటక వీసాలకు ‘నిరీక్షణ వ్యవధి’ పెరుగుతోంది. యూరప్లో ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు పర్యాటక వీసాలకు స్లాట్లు దొరకట్లేదు. విదేశీ పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుండటంతో వియత్నాంకు భారీగా వెళుతున్నారు. దానికైతే నాలుగైదు రోజుల్లోనే పర్యాటక వీసా ప్రక్రియ పూర్తవుతోంది.
హైదరాబాద్-వియత్నాం.. నేరుగా విమానం
- వాల్మీకి హరికిషన్, టూరిజం కమిటీ ఛైర్మన్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్
పర్యాటక వీసాల లభ్యతలో సౌలభ్యంతో వియత్నాంకు ఎక్కువమంది వెళుతున్నారు. మా ఏజెన్సీ నుంచి గ్రీసు వెళదామనుకున్న 36 మంది ఆలస్యం అవుతుందన్న కారణంతో టూరు రద్దు చేసుకున్నారు. పర్యాటకులు బాగా వస్తుండటంతో ఆ దేశం విమానాల సంఖ్య పెంచుతోంది. హైదరాబాద్ నుంచి వియత్నాంకు నేరుగా విమానాన్ని అక్టోబరు నుంచి నడపబోతోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్కూ సెప్టెంబరులో విమానం ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు