Green Cards: ఆరునెలల్లో గ్రీన్కార్డ్స్ దరఖాస్తుల ప్రాసెస్..!
అమెరికాలో గ్రీన్ కార్డులు లేదా శాశ్వుత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరునెలల్లోపు ప్రాసెస్ చేయాలనే సిఫార్స్పై అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలో గ్రీన్ కార్డులు లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం శ్వేత సౌధానికి పంపించనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ఐలాండర్స్పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్ సిఫార్సును అమలు చేస్తే.. గ్రీన్కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఇండో-అమెరికన్ల కల సాకారం కానుంది.
ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో-అమెరికన్ నాయకుడు అజేయ్ జైన్ భుటోరియా అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ మీటింగ్లో తెరపైకి తీసుకొచ్చారు. దీనికి కమిషన్లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమెరికాలో గ్రీన్కార్డుల బ్యాక్లాగ్ పెండింగ్ను తగ్గించేందుకు వాటిని మరోసారి సమీక్షంచాలని కమిషన్ ‘అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’కు సూచించింది. ఫ్యామిలీ గ్రీన్కార్డ్ అప్లికేషన్లు, డీఏసీఏ రెన్యూవల్స్, ఇతర గ్రీన్ అప్లికేషన్ల సమయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రతిపాదనలు చేసింది.
గ్రీన్కార్డు ఇంటర్వ్యూలను కూడా వేగవంతం చేయడం కోసం ఈ కమిషన్ మరో సిఫార్సు చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విభాగమైన నేషనల్ వీసా సెంటర్ ఆగస్టు 2022 నుంచి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని మూడు నెలల్లోగా 100శాతం ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 2022 నాటికి ఉన్న 32,439 ఇంటర్వ్యూలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని.. వచ్చే ఏడాది ఇదే సమయం నాటికి 150 శాతం పెంచాలని పేర్కొంది. ఆ తర్వాత గ్రీన్కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్కు కాలవ్యవధి ఆరునెలలు ఉండేట్లు చూసుకోవాలని కమిషన్ చెప్పింది.
అమెరికాలో వర్క్పర్మిట్లు ఇతర అంశాల విషయంలో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు కూడా అడ్వైజరీ కమిషన్ కీలక సూచనలు చేసింది. వర్క్పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, తాత్కాలిక పొడిగింపులు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సిఫార్సు చేసింది. అమెరికాలో ఏప్రిల్ నాటికి 4,21,358 ఇంటర్వ్యూలు పెండింగ్లో ఉన్నాయని అజేయ్ జైన్ భుటోరియా వెల్లడించారు. మార్చిలో వీటి సంఖ్య 4,36,700గా ఉంది.
అమెరికా జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగడంలేదని అజేయ్ అభిప్రాయపడ్డారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు లేకపోవడం కూడా దీనిలో మందగమనానికి కారణమవుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానాలు 1990లో అమల్లోకి తెచ్చారని.. ఆ తర్వాత వీటిల్లో పెద్ద మార్పులు చోటు చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.