రాసిస్తా..నితీశ్ మళ్లీ సీఎం కాలేరు: చిరాగ్
నితీశ్ కుమార్ మరోసారి ఎప్పటికీ బిహార్ ముఖ్యమంత్రి కాలేరని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు.
ఖగరియా: నితీశ్ కుమార్ మరోసారి బిహార్ ముఖ్యమంత్రి కాలేరని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు. ‘కావాలంటే నేను రాసిస్తా’నంటూ మంగళవారం ఓటు వేసిన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా చిరాగ్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీ జేడీయూ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
‘నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాలేరని నేను మీకు రాసిస్తాను. బిహార్, బిహార్ ప్రజలు ముందుండాలని నేను కోరుకుంటాను. అంతకు మించి నా పాత్ర ఏమీ లేదు. బిహార్ ప్రజల సూచనలతో సిద్ధం చేసిన భవిష్య ప్రణాళిక ప్రకారం పనిచేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రణాళిక లేదు’ అంటూ నితీశ్పై మండిపడ్డారు.
మహాగట్ బంధన్ అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఈ రోజు ఉదయం మాట్లాడుతూ..బిహార్ ప్రజలు విద్య, వైద్య సదుపాయాలు, ద్రవ్యోల్బణం వంటి తదితర అంశాలపై ఓటు వేయాలనుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా..ఈ రోజు 94 నియోజక వర్గాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. కాగా, రెండో దశ పోలింగ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలంగా ఉండనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.