సరదాగా నా కొడుకు బెంజ్కారు నడిపాడు!
బెంజ్ కారు నడిపినంత మాత్రాన ఈఎస్ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడిని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు....
తప్పుడు ప్రచారం మానుకోవాలన్న మంత్రి జయరాం
అమరావతి: బెంజ్ కారు నడిపినంత మాత్రాన ఈఎస్ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు అడిగాడు కాబట్టే సరదాగా ఆ కారు నడిపాడని జయరాం వివరించారు. బెంజ్ కారు బహుమానంగా ఇచ్చారంటూ తనపై అభియోగం మోపుతున్నారనీ.. 2019 డిసెంబర్లో కార్తీక్ కారు కొన్నాడని తెలిపారు. కానీ ఈ కేసు నమోదైంది 2020 జూన్లో అని చెప్పారు. బెంజ్కారు నడిపినంత మాత్రాన కుంభకోణంలో ఉన్నట్టేనా?అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని అయ్యన్నకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM