రిటైర్మెంటా..?ఆ మాట అనలేదు: నీతీశ్
‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దిల్లీ: ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తాజాగా నీతీశ్ స్పష్టం చేశారు. ‘నేను రిటైర్మెంట్ గురించి మాట్లాడలేదు. అన్నీ బాగా ముగుస్తాయంటూ నేను ప్రతి ఎన్నికల చివరి ర్యాలీలో ఇదే మాట చెబుతాను. మరోసారి మీరు నా ప్రసంగాన్ని వింటే మీకు ఈ విషయం స్పష్టమవుతుంది’ అని వెల్లడించినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్నియాలో పాల్గొన్న ర్యాలీలో నీతీశ్ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారానికి ఇది చివరి రోజు. ఎల్లుండి చివరి దశ ఓటింగ్ జరగనుంది. ఇవే నా చివరి ఎన్నికలు. అన్నీ బాగా ముగుస్తాయి’ అంటూ మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. అయితే, అదో రాజకీయ జిమ్మిక్కంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, ఆ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. మహాకూటమి ఆశలపై నీళ్లు చల్లింది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ను అధికారానికి దూరం చేసింది. దాంతో వరసగా నాలుగోసారి నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 16న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్