నన్లపై దాడి.. సీఎం అబద్ధం చెప్పారు:పీయూష్
యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి....
ఆరోపణలు నిరాధారమైనవన్న కేంద్రమంత్రి
కొచ్చి: యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారన్నారు. ప్రయాణీకుల నుంచి ధ్రువీకరణపత్రాలను పరిశీలించిన తర్వాత తమకు అందిన ఫిర్యాదు నిరాధారమైనదిగా నిర్ధారించుకొని విడిచిపెట్టారన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు సన్యాసినులపై దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర శాఖ, మరికొందరు యూపీ ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు.
కేరళ సీఎం పినరయి విజయన్ మైనార్టీలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని పీయూష్ గోయల్ ఆరోపించారు.
యూపీలో ఇటీవల కొందరు క్రైస్తవ సన్యాసినులు వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 19న నన్లు ఇద్దరు మహిళలను బలవంతపు మత మార్పిడికి తమ వెంట తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు వారిని రైలు నుంచి బలవంతంగా కిందికి దించివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా తొలుత క్రైస్తవ సన్యాసినులను అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన తర్వాత వారిని విడిచిపెట్టారు. అనంతరం సన్యాసినులు వేరే రైలులో ఒడిశాకు వెళ్లిపోయారు. ఈ ఘటనను కేరళ సీఎం విజయన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!